వైకాపా ఎమ్మెల్యేల కాలర్ పట్టుకుని జనం ప్రశ్నిస్తున్నారు
వైకాపా ప్రభుత్వానికి ‘గడప గడప’లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, వైకాపా ఎమ్మెల్యేల్ని జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వానికి ‘గడప గడప’లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, వైకాపా ఎమ్మెల్యేల్ని జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ధి పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతోందని శుక్రవారం ట్వీట్ చేశారు. ‘చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యేను విద్యాదీవెనపై ప్రశ్నించిన ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్పై కేసు పెట్టి అరెస్ట్ చేయడం ప్రభుత్వ అసహనానికి ప్రత్యక్షసాక్ష్యం. విద్యార్థులపైనా కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారా? పాలనను ప్రశ్నించిన ప్రతి వారిపై కేసు పెట్టాలని ఈ ప్రభుత్వం భావిస్తే....రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపైనా జగన్ కేసులు పెట్టాల్సి ఉంటుంది. జరిగిన ఘటనకు వైకాపా క్షమాపణ చెప్పి విద్యార్థిపై, అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, తెదేపా నేతలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి. వెంటనే అందరినీ విడుదల చేయాలి. స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434