కాలయాపనకు ఎత్తుగడ?
గతంలో తెదేపా అధినేత చంద్రబాబును తక్షణం కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించిన మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ను
వంగలపూడి అనిత విమర్శ
ఈనాడు డిజిటల్, అమరావతి: గతంలో తెదేపా అధినేత చంద్రబాబును తక్షణం కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించిన మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ను మాత్రం ఆ విధంగా ఎందుకు ఆదేశించలేదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. రాష్ట్రంలోని మహిళలు అందరూ ఛీ కొడుతుంటే... తీరిగ్గా రెండు రోజుల తర్వాత లేఖ రాస్తారా అని శనివారం ట్విటర్లో మండిపడ్డారు. ‘‘ ఇది చిత్తశుద్ధితో చేసిన పనికాదు. గోరంట్ల మాధవ్ను వైకాపా నుంచి ఎందుకు బహిష్కరించలేదని మహిళలు జగన్రెడ్డిని ప్రశ్నిస్తుండడంతో.... లేఖ పేరుతో కాలయాపన చేయడానికి వేసిన ఎత్తుగడ. ప్రతిపక్షంలోని మహిళలందరూ మహిళా కమిషన్ నిర్లిప్తతను ఎండగడుతుండడంతో గత్యంతరం లేక నింపాదిగా విచారణ జరపాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది రాష్ట్ర మహిళలను నయవంచనకు గురి చేయడమే...’’ అని అనిత ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!