మోదీ పాలనలో దేశం తిరోగమనం
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రధాని మోదీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుపతిలోని ఇందిరా
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్టుడే: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రధాని మోదీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో ఆదివారం జరిగిన ఆ పార్టీ జిల్లా ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడారు. ఖాదీ జెండాలనే వాడేలా చేసి ఉంటే చేనేత కార్మికులకు లబ్ధిచేకూరేదని, అలాకాకుండా కార్పొరేట్ సంస్థ ద్వారా దిగుమతి చేశారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని తెలిపారు. మోదీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తోందన్నారు. అక్టోబరులో విజయవాడ వేదికగా జరగనున్న సీపీఐ జాతీయ మహాసభల్లో భాజపా, వైకాపా అరాచకాలపై తీర్మానం చేస్తామని వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దళిత యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు, అశ్లీలంగా కన్పించిన ఎంపీని ముఖ్యమంత్రి వెనకేసుకు వస్తున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తివంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు