Andhra news: ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఇద్దరు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.

Updated : 07 May 2024 19:54 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, సదుం ఎస్సై మారుతిపై ఎన్నికల సంఘం బదిలీవేటు వేసింది. వారిద్దరినీ బదిలీ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. వారి బాధ్యతలను కిందిస్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌పై దాడి ఘటన  నేపథ్యంలోనే ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇటీవల ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డితోపాటు అనంతపురం రేంజి డీఐజీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే. కొత్త డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని