‘బండి’ పాదయాత్రపై రాళ్ల దాడి పోలీసుల వైఫల్యమే

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రపై జనగామ జిల్లా దేవరుప్పులలో తెరాస కార్యకర్తల రాళ్ల దాడి పోలీసుల వైఫల్యంతోనే జరిగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.

Published : 16 Aug 2022 06:07 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రపై జనగామ జిల్లా దేవరుప్పులలో తెరాస కార్యకర్తల రాళ్ల దాడి పోలీసుల వైఫల్యంతోనే జరిగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. అసహనంతోనే తెరాస ఈ తరహా దాడులకు పాల్పడుతోందని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాయడంతోనే తెరాస నాయకులు దాడులకు తెగబడుతున్నారని, పోలీసులే దీనికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని