జాతి నాయకుల విగ్రహాలకు నేడు కాంగ్రెస్‌ నివాళులు

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జాతి నాయకుల విగ్రహాలకు నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించనున్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు

Published : 17 Aug 2022 05:59 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జాతి నాయకుల విగ్రహాలకు నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించనున్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డిల ఆధ్వర్యంలో నాయకులు ఉదయం 8.30గంటలకు గాంధీభవన్‌ నుంచి బయలుదేరతారు. మహాత్మా గాంధీ(సికింద్రాబాద్‌), అల్లూరి సీతారామరాజు(ట్యాంక్‌బండ్‌), జవహర్‌లాల్‌ నెహ్రూ(అబిడ్స్‌), వల్లభ్‌భాయ్‌ పటేల్‌ తదితరుల విగ్రహాలతో పాటు కోఠిలోని అశోక స్తూపానికి పూలమాలలు వేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని