ఏఐసీసీ అధ్యక్ష పదవికి 30న థరూర్ నామినేషన్
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఈ నెల 30న నామినేషన్ పత్రాలు దాఖలు
దిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఈ నెల 30న నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఆ పత్రాలను ఆయన ప్రతినిధులు శనివారం ఏఐసీసీ కార్యాలయం నుంచి స్వీకరించారు. పార్టీలో సంస్థాగత సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేసిన 23 మంది (జి-23)లో ఒకరైన ఆయన.. ఈ ఎన్నిక బరిలో నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.