చేతకాకపోతే తప్పుకోండి.. పోలవరం పూర్తిచేస్తాం

పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ముఖ్యమంత్రికి చేతకాకపోతే తప్పుకోవాలని, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం పూర్తిచేసి చూపిస్తుందని సవాల్‌ విసిరారు.

Updated : 02 Oct 2022 11:42 IST

సోము వీర్రాజు

కూనవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ముఖ్యమంత్రికి చేతకాకపోతే తప్పుకోవాలని, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం పూర్తిచేసి చూపిస్తుందని సవాల్‌ విసిరారు. భాజపా ప్రజాపోరుయాత్రలో భాగంగా శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో పోలవరం నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే డబ్బులు ఇవ్వడంలేదంటూ కేంద్రంపై నెపం వేస్తున్నారని చెప్పారు. కాంటూరులు, రీసర్వేలు అంటూ కాకి లెక్కలు చెప్పి అవినీతికి పాల్పడేందుకు చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్‌మోహన్‌రెడ్డి తన ఫొటోలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని