సమస్యలు చూపిస్తా నాతో రండి: షర్మిల
వైఎస్సార్ ఇంకా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. శనివారం ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర మెదక్ జిల్లా చిలప్చెడ్,
కొల్చారం, న్యూస్టుడే: వైఎస్సార్ ఇంకా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. శనివారం ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర మెదక్ జిల్లా చిలప్చెడ్, కొల్చారం మండలాల్లో కొనసాగింది. కొల్చారం మండలం చిన్నఘనపూర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దుంపలకుంట, రంగంపేట, సంగాయిపేట, తదితర గ్రామాల్లో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని గుర్తుచేశారు. ప్రజల అభిమానంతోనే 2,400 కి.మీ. మేర పాదయాత్ర పూర్తిచేశానని చెప్పారు. యాత్ర చేసింది నేనే అయినా నన్ను నడిపించింది ప్రజలేనని పేర్కొన్నారు. తెలంగాణలో సమస్యలే లేవని చెప్పే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒక్కరోజు నాతో పాదయాత్ర చేయాలని, ప్రజల ఇబ్బందులు చూపిస్తానని సవాలు విసిరారు. సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి వెళ్లిపోతానని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని