దేశానికి కేసీఆర్‌ నేతృత్వం అవసరం

ప్రస్తుతం దేశానికి కేసీఆర్‌ లాంటి నాయకుడి అవసరం ఉందని, ఆయన నేతృత్వాన్ని  ప్రజలు కోరుకుంటున్నారని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం ఆయన ద్వారా వర్ధిల్లాలని కోరుకుంటున్నానన్నారు.

Published : 03 Oct 2022 04:45 IST

శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం దేశానికి కేసీఆర్‌ లాంటి నాయకుడి అవసరం ఉందని, ఆయన నేతృత్వాన్ని  ప్రజలు కోరుకుంటున్నారని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం ఆయన ద్వారా వర్ధిల్లాలని కోరుకుంటున్నానన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, పలువురు ఎమ్మెల్సీలతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. దేశ పరిస్థితులను చూస్తుంటే గాంధీ మళ్లీ పుట్టాలనిపిస్తోందన్నారు. పోచారం మాట్లాడుతూ మహనీయుడు గాంధీ బోధనలను అంతా అనుసరించాలన్నారు. వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. గాంధీ పథం అనుసరణీయమన్నారు. మత ఛాందసవాదుల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని