హామీలు అమలు చేయని కేసీఆర్‌ను గద్దె దించుతాం

ప్రజలకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, అడిగిన వారి పట్ల అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించేందుకు సిద్ధం కావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బ

Published : 03 Oct 2022 04:45 IST

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌

మర్రిగూడ, న్యూస్‌టుడే: ప్రజలకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, అడిగిన వారి పట్ల అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించేందుకు సిద్ధం కావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండో విడతలో భాగంగా ఆదివారం ఆయన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 23 వేల మంది వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరితే లాఠీఛార్జి చేయిస్తూ కేసీఆర్‌ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం అందించకుండా సీఎం కార్పొరేటు ఆసుపత్రులను ప్రారంభిస్తున్నారని విమర్శించారు. ఆధిపత్య పార్టీలన్నీ అక్రమంగా కూడబెట్టిన డబ్బుతో మునుగోడు ఉపఎన్నికలో విందులు, వినోదాలతో గెలవాలని ప్రయత్నిస్తున్నాయని, వాటికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని