BRS: దిల్లీలో అద్దె కార్యాలయం.. సొంత భవనం పనులు వేగవంతం
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత్ రాష్ట్ర సమితిగా (భారాస) మార్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలకు అనువుగా దేశ రాజధాని దిల్లీలో సాధ్యమైనంత త్వరగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.
ఈనాడు, దిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత్ రాష్ట్ర సమితిగా (భారాస) మార్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలకు అనువుగా దేశ రాజధాని దిల్లీలో సాధ్యమైనంత త్వరగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. తెరాసకు దిల్లీ వసంత్ విహార్లో కేటాయించిన స్థలంలో ఇప్పటికే సొంత భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆ పనులు పూర్తయ్యేందుకు మరికొంత కాలం పట్టనుండడంతో అప్పటివరకు అద్దె భవనంలో భారాస కార్యకలాపాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం దిల్లీ సర్దార్ పటేల్ మార్గ్ సమీపంలోని పాలికా మిలాన్ కావెంటర్ లేన్లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. లోపల కొన్ని మార్పులు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!