ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్‌

మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రజా గాయకుడు గద్దర్‌ పోటీ చేయనున్నారు. పార్టీ అభ్యర్థిగా గద్దర్‌ పేరును అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ అమీర్‌పేటలోని తన కార్యాలయంలో బుధవారం ప్రకటించారు.

Published : 07 Oct 2022 04:59 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రజా గాయకుడు గద్దర్‌ పోటీ చేయనున్నారు. పార్టీ అభ్యర్థిగా గద్దర్‌ పేరును అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ అమీర్‌పేటలోని తన కార్యాలయంలో బుధవారం ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే మునుగోడులో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు గద్దర్‌ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న కె.ఎ.పాల్‌తో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. నోటు తీసుకుని ఓటు వేయడం నేరమని, నోటు తీసుకోకుండా నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండనే నినాదంతో ప్రచారం నిర్వహిస్తానని ఆయన వివరించారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని