GV Harsha Kumar: జీవీ హర్షకుమార్‌ను కలిసిన వైకాపా ఎంపీ బోస్‌

మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ను ఆయన నివాసంలో రాజ్యసభ సభ్యుడు, వైకాపా నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ సోమవారం కలవడం చర్చనీయాంశమైంది.

Updated : 06 Dec 2022 09:42 IST

రాజమహేంద్రవరం(టి.నగర్‌, దేవీచౌక్‌), న్యూస్‌టుడే: మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ను ఆయన నివాసంలో రాజ్యసభ సభ్యుడు, వైకాపా నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ సోమవారం కలవడం చర్చనీయాంశమైంది. సమావేశం తర్వాత బోస్‌ మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

ఇటీవల కొత్తగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) ఏర్పాటులో భాగంగా తనకు ఇచ్చిన పదవిని హర్షకుమార్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని ఆయన దిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు వివరించారు. అప్పట్నుంచి స్తబ్దుగా ఉన్నారు. దీనిలో భాగంగా పార్టీ మారవచ్చనే ప్రచారం సాగుతున్న తరుణంలో బోస్‌ కలవడం చర్చనీయాంశంగా మారింది. బంధువుల సమస్యకు సంబంధించి పాత మిత్రుడు హర్షకుమార్‌ను కలిసినట్లు బోస్‌ ఫోన్‌లో ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని