ఆత్మగౌరవం కోసం మరో పోరుకు సిద్ధమవ్వాలి

సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో నమ్ముకున్న ఉద్యమాన్ని, ప్రజా చైతన్యాన్ని, పౌర హక్కులను ఇప్పుడు కాలరాస్తున్నారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. ఉద్యమాలు, ఉద్యమ

Published : 02 Dec 2021 04:41 IST

తొలి అమరుడు కానిస్టేబుల్‌ కిష్టయ్యకు నివాళులర్పించిన ఈటల

గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఈటల రాజేందర్‌, ఇతర నాయకులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో నమ్ముకున్న ఉద్యమాన్ని, ప్రజా చైతన్యాన్ని, పౌర హక్కులను ఇప్పుడు కాలరాస్తున్నారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు, ఉద్యమస్ఫూర్తి అనేవే లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుత పరిణామాలు గమనిస్తున్నారని, ఆత్మగౌరవం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కానిస్టేబుల్‌ కిష్టయ్య ముదిరాజ్‌ 12వ వర్ధంతి సందర్భంగా బుధవారం గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఈటల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరులు భావించిన స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక తెలంగాణ సిద్ధించలేదని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్‌లో రవీందర్‌సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారని స్పష్టం చేశారు. ఆయన వెంట ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శంకర్‌ముదిరాజ్‌, భాజపా నేతలు డా.సురేఖ, భిష్వా ఓంప్రకాష్‌  ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని