Harish Rao: వంద రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదు: హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని మోసం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని మోసం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల డీఏలు చెల్లించలేదని తెలిపారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని మోసం చేశారన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఉన్నది వచ్చిన కరవు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరవు అని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!