కమల్నాథ్ చేతికి కాంగ్రెస్ పగ్గాలు..?
దశాబ్దాల ఘన చరిత కలిగిన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా..?గాంధీల కుటుంబం నుంచి కాకుండా మరో వ్యక్తికి సారథ్య బాధ్యతలు అప్పగించబోతున్నారా? అంటే అవుననే సమాధానమే
సోనియాగాంధీతో భేటీ అయిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం
ఇంటర్నెట్డెస్క్: దశాబ్దాల ఘన చరిత కలిగిన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా..?గాంధీల కుటుంబం నుంచి కాకుండా మరో వ్యక్తికి సారథ్య బాధ్యతలు అప్పగించబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలను వచ్చే నెలలో నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్కు కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కమల్నాథ్ భేటీ అవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
గురువారం సోనియగాంధీ నివాసానికి వెళ్లిన కమల్నాథ్.. ఆమెతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీలో మార్పుల గురించి వీరిద్దరూ చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో కమల్నాథ్ పేరు గతకొంతకాలంగా వినిపిస్తోంది. దీంతో ఈ విషయంపైనే వీరిద్దరూ తాజాగా భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
గాంధీ కుటుంబానికి విధేయుడు..
గాంధీ కుటుంబానికి కమల్నాథ్ అత్యంత సన్నిహితుడు. రాహుల్గాంధీతోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. 1980లో తొలిసారిగా ఎన్నికైన ఆయన.. తొమ్మిసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. దివంగత నేత అహ్మద్ పటేల్ తర్వాత పార్టీలో అన్ని వర్గాలతో అనుబంధం ఉన్న నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
త్వరలోనే ఎన్నికలు..
2017లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాహుల్.. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో మళ్లీ సోనియాగాంధీకే తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి అధ్యక్ష పదవికి ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరపాలని నిర్ణయించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా వేశారు. తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తర్వాత అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?