Punjab Elections: ఒక్క నంబర్కు అన్ని కాల్స్ అసాధ్యం.. ఆప్ది పచ్చి మోసం: సిద్ధూ
మరికొన్ని రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సారి అధికారం చేపట్టేది ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)యేనని.. ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో ఈ విషయాన్నే పదే పదే చెబుతూ.. పంజాబ్ సీఎం అభ్యర్థి ఎంపికపై
అమృత్సర్: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈ సారి అధికారం చేపట్టేది ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)యేనని.. ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో ఈ విషయాన్నే పదే పదే చెబుతూ.. పంజాబ్ సీఎం అభ్యర్థి ఎంపికపై ప్రజల అభిప్రాయం కూడా అడిగారు. ‘జనతా చునేగీ అప్నా సీఎం’ పోల్లో పాల్గొన్న వారిలో 93 శాతం మంది భగవంత్ మాన్ పేరును ప్రతిపాదించారట. దీంతో కేజ్రీవాల్ ఆయన్నే పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, ఆప్ నిర్వహించిన ఈ పోలింగ్ అంతా మోసమని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపిస్తున్నారు. ప్రజలను ఫూల్స్ చేయడానికి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆప్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
‘‘పంజాబ్ సీఎం అభ్యర్థిపై టెలీపోలింగ్ కోసం ఆప్ పార్టీ ఒక్క నంబర్ మాత్రమే ఇచ్చింది. ఆ నంబర్కే 7 లక్షల వాట్సాప్ సందేశాలు, 21 లక్షల వాయిస్ కాల్స్, సందేశాలు వచ్చాయని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి పోలింగ్ కోసం చేసే కాల్స్కు కనీసం 15 సెకన్ల సమయం పడుతుంది. అంటే రోజులో 5,760 కాల్స్ మాత్రమే మాట్లాడగలరు. నాలుగు రోజుల్లో 23,040 కాల్స్ మాత్రమే వస్తాయి. కానీ, 21 లక్షల కాల్స్, సందేశాలు రావడం అసంభవం. ఈ గణాంకాలు చాలా గందరగోళంగా, సందేహాత్మకంగా ఉన్నాయి. ఇలాంటి మోసపూరిత పోలింగ్తో ఆప్ తప్పుడు ప్రచారం చేస్తోంది. పంజాబ్ ప్రజలను పూల్స్ చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు’’ అని సిద్ధూ ధ్వజమెత్తారు. ఆప్ నిర్వహించిన ఈ పోలింగ్పై తమ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని సిద్ధూ తెలిపారు. కాల్స్ హిస్టరీ పరిశీలించాలని, అందులో మోసం జరిగినట్లు బయటపడితే ఆప్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.