BJP: 14 రోజులు.. 17 నియోజకవర్గాల్లో భాజపా బస్సు యాత్రలు
తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1025 కి.మీ మేర ఐదు బస్సు యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి మార్చి 4 వరకు కొనసాగుతాయన్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ‘కుమురం భీం’.. కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్లలో ‘శాతవాహన’.. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్లో ‘కాకతీయ’.. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండలో ‘కృష్ణమ్మ’.. భువనగిరి, మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్లో ‘భాగ్యనగర’ పేరిట యాత్రలు చేస్తామన్నారు.
పదేళ్లలో ప్రధాని మోదీ సర్కారు సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తెలంగాణలో 17 సీట్లు కచ్చితంగా గెలుస్తామని.. హైదరాబాద్లో ఎంఐఎంను మట్టికరిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మండల, నియోజకవర్గాల వారీగా రోడ్షోలు ఉంటాయని చెప్పారు. అన్ని యాత్రలు భాగ్యనగరంలో కలిసే విధంగా ప్రణాళిక చేశామని తెలిపారు. యాత్రకు సంబంధించిన పోస్టర్ను నేతలతో కలిసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి ఆవిష్కరించారు.
తెలంగాణలో కాంగ్రెస్, భాజపాకు మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు సుస్థిరత, అస్థిరతకు మధ్య జరగనున్నాయన్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకూ ఒక్క ఎంపీ సీటూ ప్రకటించలేదని.. ఎన్నికల కమిటీ ఇంకా సమావేశం కాలేదన్నారు. మేడిగడ్డ సందర్శనపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే తాము బ్యారేజీని సందర్శించామని తెలిపారు. ఇప్పుడు మళ్లీ వెళ్లాల్సిన అవససరం లేదని స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై ఏపీ, తెలంగాణ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్