Baahubali series: ‘బాహుబలి’ యానిమేటెడ్‌ సిరీస్‌ ట్రైలర్‌ చూశారా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది.

Published : 02 May 2024 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారతీయ చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లాయి ‘బాహబలి’ సిరీస్‌ చిత్రాలు. వీటినే ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌గా మరోసారి ప్రేక్షకులకు అందించనున్నట్లు రాజమౌళి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) వేదికగా మే 17 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. ‘మాహిష్మతి రక్తంతో రాసిన కొత్త కథ’ అంటూ విడుదలైన ఈ ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో సినిమా కథను, పాత్రలను వివరించారు.

ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్‌, నాజర్‌ కీలకపాత్రల్లో నటించిన ‘బాహుబలి’ రెండు భాగాలు బాక్సాఫీస్‌ వద్ద కోట్లు వసూళ్లు చేశాయి. దీంతో మూడో పార్ట్‌పై సినీప్రియులు ఆసక్తిగా ఉన్నారు. గతంలో ఓ సందర్భంలో రాజమౌళి దీని గురించి మాట్లాడుతూ.. ‘‘తప్పకుండా మూడో భాగం ఉంటుంది. ‘బాహుబలి’ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈసారి మీకు చూపించనున్నాం. దీనికి సంబంధించిన వర్క్‌ చేస్తున్నాం. మా నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారు. దీన్ని చూపించడానికి కాస్త సమయం పట్టొచ్చు’’ అన్నారు. రాజమౌళి లైనప్‌లో దీని మూడోభాగం కూడా ఉండడంతో ప్రేక్షకులు ఆనందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మహేశ్‌బాబుతో తీయనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని