Kotamreddy: అనిల్‌ యాదవ్‌ డూపుల సంఘానికి అధ్యక్షుడు: కోటంరెడ్డి ఎద్దేవా

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నెల్లూరు పర్యటన అట్టర్‌ఫ్లాప్‌ అని మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy ) అన్నారు.

Published : 07 Mar 2024 14:28 IST

నెల్లూరు: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నెల్లూరు పర్యటన అట్టర్‌ఫ్లాప్‌ అని మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy ) అన్నారు. సీఎం తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆయన.. ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైకాపా ఎంపీ అభ్యర్థిగా విజయసాయి ఓటమి ఖాయమన్నారు. 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారని చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అందరికీ కావాల్సిన వ్యక్తి అన్నారు. అధికార పార్టీ నుంచి బయటకు రావడంతో ఆయనపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరులో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు.

మాజీ మంత్రి అనిల్‌ యాదవ్‌పై కోటంరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన డూపుల సంఘానికి అధ్యక్షుడని వ్యాఖ్యానించారు. నరసరావుపేటలో ఎంపీగా గెలవలేరని.. డూపుల సంఘానికి ఎన్నికలు జరిగితే ముందుంటారని ఎద్దేవా చేశారు. ఆయన నయా బందిపోటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అనిల్‌.. నీకు సీటు ఇప్పించిన ఆనం వివేకానందరెడ్డిపై తిరగబడ్డావ్‌. విశ్వాసం లేకుండా ఆయన్ను బెదిరించావ్‌. ఇప్పుడు నువ్వా నీతులు చెప్పేది? నీ లెక్కలు ప్రజలు సరిచేస్తారు. తెదేపా నుంచి వేమిరెడ్డి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో నరసరావుపేటలో అంతే తేడాతో అనిల్‌ ఓడితారు’’ అని కోటంరెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని