తొలుత రైతు రుణమాఫీ
రాజ్యాంగాన్ని మార్చుతామని, రిజర్వేషన్లను రద్దు చేస్తామని భాజపా, ఆర్ఎస్ఎస్ బహిరంగంగా ప్రకటనలు చేస్తూ పేదప్రజలు, దేశం ఆత్మపై దాడికి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు
ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ
బిలియనీర్లకు మోదీ సర్కారు మాఫీ చేసిన డబ్బును పేదల ఖాతాల్లో వేస్తాం
నర్సాపూర్, సరూర్నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ
ఈనాడు, హైదరాబాద్: రాజ్యాంగాన్ని మార్చుతామని, రిజర్వేషన్లను రద్దు చేస్తామని భాజపా, ఆర్ఎస్ఎస్ బహిరంగంగా ప్రకటనలు చేస్తూ పేదప్రజలు, దేశం ఆత్మపై దాడికి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. గత పదేళ్లలో 22-25 మంది బిలియనీర్లకు మోదీ సర్కారు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని, పేదలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగులకు మాత్రం ఏమీ చేయలేదని ఆరోపించారు. జూన్ 4న కేంద్రంలో ఇండియా కూటమి సర్కారు ఏర్పాటైన వెంటనే తొలుత రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. బిలియనీర్లకు మోదీ సర్కారు మాఫీ చేసిన డబ్బును పేదల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగస్టు 15 నుంచి చేపడతామని తెలిపారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్లో, హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర సభల్లో రాహుల్ మాట్లాడారు. రిజర్వేషన్లు, ప్రభుత్వరంగ సంస్థలు, రాజ్యాంగాన్ని అందరూ కలిసి పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.10 లక్షల ఆరోగ్య బీమా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా అందించిందని, పోడుభూముల సమస్యను పరిష్కరించిందని వివరించారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం దిల్లీలో సైనికుడిలా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. రాష్ట్రం తరహాలోనే దేశంలో కాంగ్రెస్ పరిపాలన అందిస్తుందని చెప్పారు.
రాజ్యాంగంతోనే బలహీనులకు రక్షణ..
‘‘దేశంలోని పేదలు, బలహీనులు, దళితులు, ఆదివాసీలు, బీసీలు, రైతులు, కార్మికుల అధికారాలను రాజ్యాంగం రక్షిస్తోంది. అది పేదల గొంతుక. కాంగ్రెస్ పార్టీ, దేశంలోని కోట్ల మంది రక్తాన్ని చిందించి పోరాటం చేసి రాజ్యాంగాన్ని తయారు చేశారు. గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ ఏళ్ల తరబడి స్వాతంత్య్ర పోరాటం చేసి, జైలుకెళ్లి, చెమటోడ్చి అందుబాటులోకి తీసుకువచ్చారు. లోక్సభ ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని రక్షించి, దేశాన్ని కాపాడాలని రాహుల్, రేవంత్రెడ్డి, మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి అంటోంది. రాజ్యాంగాన్ని మార్చాలని, పక్కన పెట్టాలని మోదీ, అమిత్షా, ఆర్ఎస్ఎస్ నాయకులు అంటున్నారు. ప్రపంచంలోని ఏశక్తీ రాజ్యాంగాన్ని రద్దు చేయలేదు.
దేశాన్ని 2-3 శాతం మందే నడిపిస్తున్నారు..
దేశంలో 50 శాతం మంది బీసీలు, 15 శాతం ఎస్సీలు, 8 శాతం ఆదివాసీలు, 15 శాతం మైనార్టీలు, 5 శాతం మంది జనరల్ వర్గాల్లోని పేదలు ఉన్నారు. వీరందర్నీ కలిపితే 90 శాతానికి పైగా అవుతారు. కానీ, వారికి దేశ పరిపాలనలో తగిన భాగస్వామ్యం కల్పించడం లేదు. తెలంగాణలో ఎలా కులగణన చేస్తున్నామో.. అలాగే దేశవ్యాప్తంగా చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదల రాజకీయ చైతన్యం కోసం ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది. దేశాన్ని కేవలం 2-3 శాతం మంది నడిపిస్తున్నారు. ప్రభుత్వం, సంస్థలు.. అన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయి. కులగణన తర్వాత ఈ దేశానికి ఎవరి బలం ఎంతో తెలియడంతో పాటు బడుగు, బలహీనవర్గాల వాటా ఎంత ఉండాలో వెల్లడవుతుంది.
ప్రజలను లక్షాధికారుల్ని చేస్తాం..
భాజపా 22 మంది బిలియనీర్లను తయారు చేస్తే.. ఇండియా కూటమి కోట్ల మందిని లక్షాధికారుల్ని చేసేలా చారిత్రక, విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలైన తర్వాత ప్రపంచంలోని ప్రతి దేశమూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. మోదీ బిలియనీర్లకు డబ్బు ఇస్తే.. మేం పేదలు, రైతులు, నిరుద్యోగులకు ఇవ్వనున్నాం. తెలంగాణ, యూపీ, మహారాష్ట్ర.. ఇలా దేశంలోని అన్ని గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరించి, పేదల పేర్లు జాబితాలో చేర్చుతాం. రైతులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అత్యంత పేదరికంలో ఉన్నవారి వివరాలు తీసుకుంటాం. అత్యంత పేదకుటుంబాల్లో ఒక్కో మహిళ పేరు ఎంపిక చేసి.. ఆమె బ్యాంకు ఖాతాలో ఇండియా కూటమి సర్కారు ఏడాదికి రూ.లక్ష చొప్పున జమ చేస్తుంది. కోట్ల కుటుంబాలకు ప్రతినెలా రూ.8,500 చొప్పున ఒకటో తేదీన బ్యాంకు ఖాతాలో జమవుతాయి. ఈ డబ్బును చదువు, ఆరోగ్యం, భోజనం కోసం ఖర్చు చేసుకోవచ్చు. దేశంలో, తెలంగాణలో ఒక్క దెబ్బతో పేదరికం దూరమవుతుంది.
ఏడాది శిక్షణతో కూడిన కొలువులు..
మహిళలు తమ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన సొమ్ముతో దుస్తులు, మందులు కొంటారు. ఈ దేశంలోని చిన్న, పెద్ద కంపెనీలు వాటిని తయారు చేస్తాయి. ఈ పరిశ్రమల పని ప్రారంభమైన వెంటనే.. ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. మోదీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా కోట్ల మంది యువకుల్ని నిరుద్యోగులుగా మార్చేశారు. అదానీ కోసం నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ తీసుకొచ్చారు. మేం ‘మొదటి ఉద్యోగం పక్కా’ పేరిట కొత్త పథకం తీసుకొస్తున్నాం. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు, ఆసుపత్రులు, కార్యాలయాల్లో నిరుద్యోగులకు ఏడాదిపాటు శిక్షణతో కూడిన కొలువులు కల్పిస్తాం. దేశంలోని ప్రతి పట్టభద్రుడు, డిప్లొమా హోల్డర్కు అప్రెంటిస్షిప్ కల్పిస్తాం. అప్రెంటిస్ కాలంలో ఏడాదికి రూ.లక్ష అందిస్తాం. వరి, గోధుమలు, ఇతర ఆహార పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తాం. ఉపాధి హామీ కార్మికులకు ప్రస్తుతం రోజుకు రూ.250 లభిస్తోంది. కూటమి సర్కారు వచ్చిన వెంటనే రూ.400 చేస్తాం. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాల్ని రెట్టింపు చేస్తాం’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మోదీ కేవలం 22-25 మంది బిలియనీర్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపించారు. గత పదేళ్లుగా అదానీ, అంబానీ కోసమే పనిచేశారు. పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పరిశ్రమలు వారికే ఇచ్చారు. ధనవంతుల్ని మరింత ధనవంతులుగా చేశారు. వారి దగ్గర ఉన్న సంపద.. దేశంలో 75 కోట్ల మంది సంపదతో సమానం. ఆ ధనవంతుల కోసమే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారు. ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు తొలగించేందుకు ఇలా చేస్తున్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా అంటోంది. 50 శాతం కన్నా ఎక్కువగా ఇవ్వాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
రాహుల్గాంధీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా