కాంగ్రెస్కు ఏటీఎంలా రాష్ట్రం
ప్రస్తుత ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ వికాస్లకు మధ్య.. కాంగ్రెస్ కుటుంబ సంక్షేమానికి, దేశ ప్రగతికి మధ్య.. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలకు, మోదీ అభివృద్ధి గ్యారంటీలకు మధ్య జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు.
భాజపా 400 స్థానాల సాధనలో తెలంగాణ కీలకం
‘భువనగిరి సభ’లో కేంద్ర హోంమంత్రి అమిత్షా
ఈనాడు, నల్గొండ- న్యూస్టుడే, భువనగిరి: ప్రస్తుత ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ వికాస్లకు మధ్య.. కాంగ్రెస్ కుటుంబ సంక్షేమానికి, దేశ ప్రగతికి మధ్య.. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలకు, మోదీ అభివృద్ధి గ్యారంటీలకు మధ్య జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా మోదీ నినాదమే కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్, భారాస, మజ్లిస్ పార్టీలు ముస్లింల బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. షరియత్, ఖురాన్ ఆధారంగానే తెలంగాణలో పాలన సాగుతోందని ఆరోపించారు. భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా గురువారం భువనగిరి పురపాలిక పరిధిలోని రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్షా ప్రసంగించారు. ఇప్పటికే దేశంలో మూడు దశల ఎన్నికలు పూర్తి కాగా.. వాటిలో 200 స్థానాల్లో భాజపా గెలవబోతోందని, మొత్తంగా 400 స్థానాల సాధనలో తెలంగాణ కీలకమని అన్నారు. రాష్ట్రంలో పది కంటే ఎక్కువ స్థానాల్లో పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారాస తొమ్మిదిన్నరేళ్లపాటు అవినీతికి పాల్పడితే.. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపించారు.
రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదు
‘‘ప్రస్తుతం కాంగ్రెస్ ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉందంటే ఆ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు. భువనగిరిలో ఆ పార్టీ అభ్యర్థి గతంలో రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే.. సస్పెండ్ చేశారు. వేరే అభ్యర్థులు దొరకక.. ఆయనకే టికెట్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మోదీ మూడోసారి ప్రధాని అయితే రిజర్వేషన్లను తొలగిస్తారంటూ దుష్ప్రచారం చేస్తోంది. పదేళ్లుగా పూర్తి మెజార్టీతో మేం అధికారంలో ఉన్నా ఎవరి రిజర్వేషన్లనూ తొలగించలేదు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కోటాలో నుంచి ముస్లింలకు 4 శాతం ఇచ్చారు. ఇక్కడ పది కంటే ఎక్కువ స్థానాల్లో భాజపాను గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగించి.. తిరిగి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తాం.
హామీలను నెరవేర్చని కాంగ్రెస్..
తాను ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ఎన్నటికీ నెరవేర్చదు. మోదీ అయితే ఏం చెబితే అది తప్పకుండా చేస్తారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. చేయలేదు. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. 70 ఏళ్లుగా కాంగ్రెస్ అయోధ్య రామమందిరాన్ని ఓట్ల కోసం వినియోగించుకుంది. మోదీ మాత్రం రామమందిర నిర్మాణం వాగ్దానాన్ని నెరవేర్చారు. తెలంగాణకు, రాజస్థాన్కు కశ్మీర్తో ఏం సంబంధమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. అక్కడ 370 ఆర్టికల్ను తొలగించి.. 24 గంటలూ జాతీయ పతాకం ఎగిరేలా ప్రధాని మోదీ సంకల్పం చేశారు. ఉగ్రవాదులు, మావోయిస్టుల చర్యల నుంచి దేశాన్ని సురక్షితం చేశారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. దాని కోసం భువనగిరి యువత, ప్రజలు ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
రూ.14 వేల కోట్లతో పోచంపల్లిలో టెక్స్టైల్ పార్కు
ప్రధాని మోదీ భువనగిరికి చాలా చేశారు. ఇక్కడి జౌళి పరిశ్రమ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. రూ.14 వేల కోట్లతో పోచంపల్లిలో టెక్స్టైల్ పార్కు, చేనేత పార్కులను ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా రైతు కూలీలకు, రైతులకు లబ్ధి చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లతో తీసుకువచ్చిన జాతీయ టెక్స్టైల్ విధానం ద్వారా 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బీబీనగర్లో ఎయిమ్స్ ఏర్పాటు ద్వారా నల్గొండ, భువనగిరి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. జనగామ, భువనగిరి రైల్వేస్టేషన్లను పూర్తిస్థాయిలో ఆధునికీకరించనున్నాం. కొమురవెల్లిలో త్వరలోనే రైల్వేస్టేషన్ నిర్మిస్తాం. రాయగిరి నుంచి వరంగల్ వరకు ఇప్పటికే నాలుగు లైన్ల రైల్వే ట్రాక్ పూర్తయింది. సూర్యాపేట నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారి నిర్మాణం వేగంగా సాగుతోంది’’ అని అమిత్షా అన్నారు. బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. హామీల అమలులో విఫలమైన సీఎం రేవంత్రెడ్డి ఎక్కడికి వెళ్లినా దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారన్నారు. ప్రజలకు కావాల్సింది ప్రమాణాలు కాదని.. వాగ్దానాల అమలు అని అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేని కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలని ప్రజలు ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో భాజపా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, నాయకులు కాసం వెంకటేశ్వర్లు, చాడ సురేశ్రెడ్డి, గంగిడి మనోహర్రెడ్డి, పడాల శ్రీనివాస్, సంకినేని వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో భువనగిరికి వచ్చిన అమిత్షా.. అక్కడి నుంచి రహదారి మార్గంలో సభాస్థలికి చేరుకున్నారు.
ఆ మూడు పార్టీలూ ఒక్కటే
ముస్లిం బుజ్జగింపు రాజకీయాల్లో కాంగ్రెస్, భారాస, మజ్లిస్ ఒక్కటే. మైనార్టీల సంతుష్టీకరణలో అవి ఏబీసీల్లా పనిచేస్తున్నాయి. ఏ అంటే అసదుద్దీన్, బీ-భారాస, సీ-కాంగ్రెస్. మజ్లిస్ను నిలువరించడం భారాస, కాంగ్రెస్ వల్ల కాదు. అది కేవలం భాజపాతోనే సాధ్యం. హైదరాబాద్లో శ్రీరామనవమి ఊరేగింపును అడ్డుకున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదు. ఇండి కూటమి నేతలు సీఏఏని వ్యతిరేకిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రామమందిర ప్రతిష్ఠాపన ఆహ్వానాన్ని సైతం తిరస్కరించారు. వీరికి ఎందుకు ఓటేయాలి?
అమిత్ షా
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.