వికసిత్ కాదు.. విఫల భారత్!
‘‘మోదీ పదేపదే చెప్పే వికసిత భారత్.. విఫల భారత్ అయింది. సబ్కా సాథ్.. సబ్కా వికాస్ కూడా సత్యనాశ్ అయింది’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు.
భావోద్వేగాలతో భాజపా ఆటలు
హామీలతో కాంగ్రెస్ మోసం చేసింది
కరీంనగర్ రోడ్షోలో కేసీఆర్
కరీంనగర్, ఈనాడు- రాంపూర్, న్యూస్టుడే: ‘‘మోదీ పదేపదే చెప్పే వికసిత భారత్.. విఫల భారత్ అయింది. సబ్కా సాథ్.. సబ్కా వికాస్ కూడా సత్యనాశ్ అయింది’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. గురువారం రాత్రి కరీంనగర్లో కరీంనగర్ భారాస లోక్సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్లో కేసీఆర్ మాట్లాడుతూ పదేళ్ల మోదీ పాలనతో పాటు, నాలుగు నెలల కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు. ‘‘ఇప్పటికే మోదీ పాలనలో దేశం నాశనమైంది.. ఇంకా ఇలాగే కొనసాగితే సర్వనాశనమవుతుంది.మాట్లాడితే పాకిస్థాన్, పుల్వామా అంటారు. భాజపా భావోద్వేగంతో మత విద్వేషాలు రెచ్చగొడుతూ మనతో ఆటలాడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే దేశం ఆగమవుతుంది. పదేళ్ల కిందట మోదీ ప్రధాని అయ్యారు. 150 హామీలిచ్చారు. ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. 14 మంది పీఎంలు కలిసి రూ.51 లక్షల కోట్ల రుణాలు తీసుకుంటే... ఒక్క మోదీయే రూ.105 లక్షల కోట్ల అప్పు చేశారు. కార్పొరేట్ సంస్థలకు రుణాలు మాఫీ చేశారు. రైతులను మాత్రం రాచి రంపాన పెట్టారు. విద్యాచట్టం ప్రకారం ప్రతి జిల్లాకు నవోదయ ఇవ్వాలి. కానీ తెలంగాణకు ఇవ్వలేదు. దీనికోసం 150 ఉత్తరాలు రాశాను. 157 వైద్యకళాశాలలు అంతటా ఇచ్చి రాష్ట్రానికి మంజూరు చేయలేదు. కొత్త ప్రాజెక్టులకు జాతీయ హోదా రాలేదు. పైగా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నా మెడపై మోదీ కత్తి పెట్టారు. నన్ను చంపినా.. నా తల తెగినా మీటర్లు పెట్టనని చెప్పాను. రూ.5 వేల కోట్ల భారం పడినా భరించాం. గత లోక్సభ ఎన్నికల్లో నలుగురు భాజపా ఎంపీలు గెలిచి నాలుగు రూపాయల పని చేయలేదు. కరీంనగర్కు సంజయ్తో ఏమైనా లాభం జరిగిందా..? ఆయన మాట్లాడితే అది ఏ భాషనో అర్థం కాదు.
రాష్ట్ర భవిష్యత్తు మనది
ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో దెబ్బతిన్నాం. ఇకముందు అలా జరగొద్దు! రాష్ట్ర భవిష్యత్తు మనది. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠాన్ని చూపించింది. ఆరు గ్యారంటీలు 13 అంశాలు, 420 హామీలతో మోసం చేసింది. రాహుల్గాంధీ, మహిళా నాయకురాలు అల్కాలాంబా మహిళలకు రూ.2500 ఇస్తున్నామన్నారు. కానీ ఇస్తున్నారా..?కరోనా కష్టమొచ్చినా.. నోట్ల రద్దుతో ఇబ్బందులున్నా, రూ.30 వేల కోట్లు రుణమాఫీ చేశాం. 12 రోజులుగా బస్సు యాత్ర చేస్తున్నాను. ఎక్కడ అడిగినా కాంగ్రెస్ చేసిందేమీ లేదంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో జరిగిందని ఆగం చేశారు. నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జలదృశ్యంగా కనిపించేది. 200 కి.మీ.ల మేర గోదావరి అమృతధారలా ప్రవహించేది. నేను ముఖ్యమంత్రి అయిన ఏడాదిన్నరలో కరెంట్ లోటులేకుండా ఇచ్చాం. ఇవన్నీ చూస్తుంటే నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి. బాధ కలుగుతోంది. నాలుగైదు నెలల్లోనే ఇంత ఆగమెందుకైంది. రేవంత్రెడ్డి 5 ఎకరాలు పైబడిన వారికి రైతుబంధు ఇవ్వరట. దున్నినవారికి ఇస్తారట. వాళ్లనెలా గుర్తిస్తారు. రేషన్పై సన్నబియ్యం రావట్లేదు. బెల్ట్ దుకాణాలు రద్దు చేస్తామని చెప్పి చేయలేదు. పార్లమెంటు ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో.. తెలియదు.! దళితబంధు హుజూరాబాద్లో 20 వేల మందికిచ్చాం. రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ ఎందుకివ్వడం లేదు. కరీంనగర్, నిజామాబాద్లలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. అందుకనే ముస్లిం మైనారిటీలు భారాసకు ఓటెయ్యాలి. మీరు కాంగ్రెస్కు ఓటు వేస్తే భాజపా గెలిచే ప్రమాదముంది’’ అని కేసీఆర్ అన్నారు. రోడ్షోలో కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, కరీంనగర్ మేయర్ సునీల్రావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్తో పాటు కరీంనగర్కు ఆయన మనుమడు హిమాన్షు వచ్చారు. బస్సులోనే ఉన్నారు. రోడ్షో తరువాత తాత కేసీఆర్తో కలిసి తీగలగుట్టపల్లిలోని స్వగృహానికి వెళ్లారు. అక్కడ స్థానిక భారాస నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమై రాష్ట్రవ్యాప్తంగా భారాసకు వచ్చే సీట్ల విషయమై చర్చించారు. కరీంనగర్లో సర్వే ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని ఆయన నాయకులకు తెలిపినట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!