Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!
Panchumarthi Anuradha: ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పంచుమర్తి అనురాధ రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు? అతి చిన్న వయసులోనే మేయర్గా ఎలా ఎన్నికయారు?
పంచుమర్తి అనురాధ గురించి ఆసక్తికర విషయాలు
ఇంటర్నెట్డెస్క్: వైకాపాకు షాక్ ఇస్తూ, ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి, ఉత్సాహంతో ఉన్న తెదేపా శ్రేణుల్లో ఈ విజయం రెట్టింపు ఉత్సాహం నింపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన పంచుమర్తి అనురాధ.. రాజకీయ ప్రయాణమూ ఒక సంచలనమే. అనుకోకుండా రాజకీయాల్లో వచ్చి అతి పిన్న వయసులోనే విజయవాడ మేయర్గా తనదైన ముద్రవేశారు.
రాజకీయాలకు సంబంధం లేని కుటుంబం..
పంచుమర్తి అనురాధ కుటుంబానికి రాజకీయాలకు అసలు సంబంధమే లేదు. తండ్రి స్వర్గం పుల్లారావు ఐఆర్ఎస్. ఆదాయపన్నుశాఖలో జాయింట్ కమిషనర్గా పనిచేసి, పదవీవిరమణ చేశారు. తల్లి గృహిణి. అనురాధకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో బదిలీలు జరుగుతుండేవి. అలా ప్రాథమిక విద్య హైదరాబాద్ సెయింట్ ఆన్స్లో చదివారు. ఆ తర్వాత ఆయనకు బదిలీ కావడంతో అనురాధ హైస్కూల్, ఇంటర్ విద్యను విజయవాడలో పూర్తి చేశారు. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ను గుంటూరు జేకేసీ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే పారిశ్రామికవేత్త శ్రీధర్తో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఒక పాప. ఆ తర్వాత పంచుమర్తి అనూరాధ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అటు పుట్టింటి వారు, ఇటు అత్తింటి వారు ఎవరికీ రాజకీయాలతో సంబంధం లేదు.
అతి పిన్న వయసులో అనుకోకుండా మేయర్
పంచుమర్తి అనురాధ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. 2000 సంవత్సరంలో విజయవాడ మేయర్ పదవిని మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో ఒక రోజు పేపర్ చదువుతుండగా.. ఆ వార్త అనురాధను ఆకర్షించింది. దీంతో తన చదువు, కుటుంబ వివరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపారు. (Panchumarthi Anuradha) అప్పట్లో కార్పొరేటర్, మేయర్లకు విడివిడిగా ఎన్నికలు జరిగేవి. దీంతో తెదేపా నుంచి మేయర్గా పోటీ చేసేందుకు ఏకంగా 18మంది దరఖాస్తు చేసుకున్నారు. రాజకీయాలకు కేంద్ర బిందువు విజయవాడ. అక్కడ జరిగే చిన్న రాజకీయ చర్యయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్పై కచ్చితంగా ప్రభావం చూపేదే. పైగా అటు కమ్యూనిస్ట్లకు ఇటు కాంగ్రెస్కు కూడా బలమైన కేడర్ ఉంది. దీంతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. టెక్నాలజీ అంటే స్వతహాగా ఆసక్తి ఉన్న చంద్రబాబుకు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన పంచుమర్తి అనురాధ ఇచ్చిన సమాధానాలు, పంచుకున్న అభిప్రాయాలు నచ్చాయి. (Panchumarthi Anuradha) అంతేకాదు, విద్యారంగంపైన కూడా అడిగిన ప్రశ్నలకు అనురాధ చక్కగా సమాధానం ఇవ్వడం, ఉన్నత విద్యావంతురాలు కావడంతో చంద్రబాబు ఆమెవైపే మొగ్గు చూపారు. నేరుగా జరిగిన మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నాగరాణి, కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థి తాడి శకుంతల నుంచి గట్టి పోటీ ఎదురైనా దాదాపు 6,800 పైచిలుకు ఓట్లతో అనురాధ విజయం సాధించారు.
గందరగోళం నుంచి సక్సెస్ఫుల్ మేయర్గా..
అనురాధ మేయర్గా ఎన్నికైనా రాజకీయ అనుభవం లేకపోవడంతో తొలినాళ్లలో ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ కార్పొరేటర్ల నుంచి తరచూ ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యేవి. అసలు మొదటి అయిదు నెలలు ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. దీంతో మేయర్ బాధ్యతలు, విధుల గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని సంకల్పించారు. ట్యూషన్ పెట్టించుకుని మరీ మున్సిపల్ యాక్ట్, నగరానికి, పౌరులకు ఏం చేయాలి? నగరాల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏంటి? ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకుని ముందుకు సాగారు. ఆ సమయంలో కృష్ణ పుష్కరాలు జరగడంతో రాజకీయంగా అనేక విషయాలను నేర్చుకునేందుకు ఎంతో దోహదపడ్డాయి.
పార్టీ కోసమే..
మేయర్ పదవి పూర్తయిన తర్వాత అనురాధ కొన్నాళ్లపాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉండిపోయారు. అసలు ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగాలని ఆమె అనుకోలేదు. అయితే, 2007 నుంచి మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలు పెట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనుకున్నా, అనుకోని కారణాల వల్ల రాలేకపోయారు. (Panchumarthi Anuradha) 2009లో మంగళగిరి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ, ఆ సీటు భాజపాకు వెళ్లిపోవడంతో కుదరలేదు. చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నా, దూరం కావడంతో అందుకు ఆసక్తి చూపలేదు. ప్రత్యక్ష రాజకీయాల కన్నా పార్టీకి సేవ చేయాలని సంక్పలించారు. చంద్రబాబు కూడా ఆమెకు పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. అలా పార్టీలో వివిధ పదవులు చేపట్టారు. ఉత్తరాంధ్ర జనరల్ సెక్రటరీగా కూడా పని చేశారు . ఆ తర్వాత అధికార ప్రతినిధిగానూ వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి అవకాశం దక్కించుకోవడమే కాకుండా ఘన విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AP Congress: ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..?
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేసింది. -
PM Modi: భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ
ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. -
Tamilisai: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. -
Nara Lokesh: అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు: నారా లోకేశ్
వైకాపా హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. -
ప్రధాని పర్యటనలో పోలీసుల తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్న కూటమి నేతలు
ప్రజాగళం సభకు పోలీసులు అడుగడుగునా అనేక అవరోధాలు సృష్టించడం, ప్రధాని మోదీ పాల్గొంటున్న సభ అయినా బేఖాతరుగా వ్యవహరించడం, సహాయనిరాకరణ వంటివన్నీ సభను విఫలం చేసేందుకు పన్నిన కుట్రలో భాగమని తెదేపా, జనసేన, భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
Gudivada Amarnath: గాజువాకలో అమర్నాథ్కు ఝలక్
విశాఖ జిల్లా గాజువాక వైకాపా అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న మంత్రి అమర్నాథ్కు పార్టీశ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం ఆయన గాజువాకలో తొలిసారిగా పార్టీశ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. -
జగన్ సీఎం కాదు.. సారా వ్యాపారి
తిరుపతి బాలాజీ ఆశీస్సులతో 2014లో ఎన్డీయే విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ ఆశీస్సులతో మళ్లీ మొదలుపెడుతున్నాం. అంతకుమించిన ఘన విజయాన్ని సాధిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. -
జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటే
‘వికసిత భారత్ కోసం ఇదే సమయం. సరైన సమయం’ అనేది నరేంద్రమోదీ నినాదం. దేశానికి సరైన సమయంలో మోదీ లాంటి సరైన నాయకుడు దొరికారు. ఆ దిశగా మీ ప్రతి ప్రయత్నంలో మేము మీతో ఉంటామని మాటిస్తున్నాం. -
‘ప్రజాగళం’ సభలో ఎవరేమన్నారంటే..
అయిదేళ్లుగా సీఎం జగన్ మీద, ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో మనకు తెలుసు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. 56 రోజుల కౌంట్డౌన్ మొదలైంది. తెదేపా, జనసేన, భాజపా కూటమికి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలు చూస్తున్నారు. -
జగన్ మీ దత్తపుత్రుడు కాదా?
ముఖ్యమంత్రి జగన్తో అయిదేళ్లుగా అంట కాగుతూ కాంగ్రెస్ వైకాపా ఒకటేనని ప్రధాన మోదీ ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. -
అన్ని స్థానాలకు పోటీ చేస్తాం
బహుజనులకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించి రాజ్యాధికారంలో వారిని భాగస్వాములను చేసే దిశగా బీఎస్పీ అడుగులు వేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.పరంజ్యోతి తెలిపారు. -
అగమ్యగోచరంగా భారాస పరిస్థితి: మల్లురవి
భారాస లక్క ఇల్లు లాంటిదని, ఓటమి మంటల్లో చిక్కుకొని కాలిపోతుండడంతో ఆ పార్టీ నాయకులు బయటపడుతున్నారని దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి అన్నారు. -
మిగతా అభ్యర్థుల ఖరారుకు కాంగ్రెస్ కసరత్తు
లోక్సభ ఎన్నికల్లో ఇంకా ప్రకటించాల్సిన అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ (సీఈసీ) మంగళ, బుధవారాల్లో సమావేశమయ్యే అవకాశం ఉంది. -
దానంపై ఫిర్యాదుకు స్పీకర్ ఇంటికి భారాస ఎమ్మెల్యేలు..
భారాస పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వినతిపత్రం అందజేయాలని భారాస ఎమ్మెల్యేలు నిర్ణయించారు. -
సీఎం రేవంత్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: దాసోజు శ్రవణ్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని భారాస నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. -
తెలంగాణకు భాజపా ఏం చేసిందని ఓట్లేయాలి?
గత పదేళ్లలో తెలంగాణకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో కిషన్రెడ్డి చెప్పాలని, ప్రజలు ఎందుకు ఓట్లేయాలని భారాస నేత రావుల శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు. -
కేసీఆర్, ఒవైసీలకు రజాకార్ సినిమా చూపించాలి
కేసీఆర్, ఒవైసీ వంటి నేతలందరికీ ‘రజాకార్’ సినిమా చూపించాలని, నిజాం చేసిన అరాచకాలు వాళ్లకు తెలియాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. -
ఈవీఎం, ఈడీలతోనే మోదీ గెలుపు
భారత్ జోడో యాత్రతో సామాన్యుడి సమస్యలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సమాజంలో విద్వేష భావన వంటివి వెలుగులోకి వచ్చాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలిపారు. -
మేనిఫెస్టో ఖరారుపై రేపు సీడబ్ల్యూసీ భేటీ
లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ఖరారు చేయడానికి ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ (సీడబ్ల్యూసీ) మంగళవారం భేటీ కానుంది. -
రెండ్రోజుల ముందే అరుణాచల్, సిక్కిం ఓట్ల లెక్కింపు
అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. ముందు ప్రకటించిన ప్రకారమైతే లోక్సభ ఎన్నికల ఓట్లతో పాటు ఈ రాష్ట్రాలకు సంబంధించిన లెక్కింపు జూన్ 4న జరగాల్సి ఉంది. -
సార్వత్రికం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి
లోక్సభ ఎన్నికలు ముగిసిన నెల తర్వాత జమ్మూ-కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ ఆదివారం ఎన్నికల కమిషన్(ఈసీ)ని అభ్యర్థించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Congress: ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..?
-
Bill Gates: ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను: బిల్ గేట్స్
-
PM Modi: భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ
-
WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!