Telangana News: పార్టీలోనే ఉంటా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మహేశ్వర్రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు నిన్నటి నుంచి మీడియాలో తనపై కథనాలు రావడం బాధ కలిగించిందని..
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు నిన్నటి నుంచి మీడియాలో తనపై కథనాలు రావడం బాధ కలిగించిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్కు రాజీనామా చేస్తా అని ఎక్కడా చెప్పలేదు. కానీ, రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో వచ్చింది. వెంటనే ఆ వార్తను ఖండించా. కాంగ్రెస్లోనే ఉంటానని బహిరంగంగా ప్రకటించా. రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. అలాంటి అవకాశం రాదు. మళ్లీ ఈరోజు కూడా ఏఐసీసీకి లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. నేను ఎప్పుడూ ఎవరిపై కంప్లైంట్ చేయలేదు. ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా మాట్లాడే వ్యక్తిని. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి పార్టీ కోసం శాయశక్తులా కష్టపడుతున్నా. నిర్మల్లో రాహుల్గాంధీ పాదయాత్ర, ప్రజా చైతన్యయాత్ర, ఆదిలాబాద్లో మీటింగ్.. ఇలా ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేశా. మిస్ కమ్యూనికేషన్తో తప్పుడు సమాచారం వెళ్లింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ నాకు మంచి మిత్రుడు. ఆయనతో ఎలాంటి విభేదాల్లేవు. నాకు కాంగ్రెస్ గౌరవం ఇచ్చింది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారు. సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి కాంగ్రెస్లోనే ఉంటారు. ఆయన లేవనెత్తిన అంశాలు అధిష్ఠానం పరిష్కరిస్తుంది’’ అని మహేశ్వర్రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.