‘దీదీ అహంవల్లే బెంగాల్ రైతులకు అన్యాయం’
పశ్చిమ బెంగాల్ రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరని అన్యాయం చేశారని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా ఆరోపించారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి మోదీ తీసుకొచ్చిన ‘కిసాన్ సమ్మాన్ నిధి.......
భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా
మాల్దా: పశ్చిమ బెంగాల్ రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరని అన్యాయం చేశారని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా ఆరోపించారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి మోదీ తీసుకొచ్చిన ‘కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు కాకుండా అడ్డుకున్నారన్నారు. కేవలం అహం, గర్వంతోనే ఆమె ఇలా చేశారని విమర్శించారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 70 లక్షల మంది రైతులు అన్యాయానికి గురయ్యారన్నారు. ఏడాదికి కేంద్రం ఇస్తున్న రూ.6000 ఆర్థిక సాయాన్ని కోల్పోయారన్నారు. బెంగాల్లో నెల రోజుల పాటు భాజపా చేపట్టిన ‘క్రిషక్ సురక్షా అభియాన్ యోజన’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శనివారం ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
బెంగాల్లో దాదాపు 25 లక్షల మంది రైతులు తమ రాష్ట్రానికీ పీఎం కిసాన్ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారని నడ్డా తెలిపారు. దీంతో అప్రమత్తమైన మమతా బెనర్జీ.. పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ముందుకు వచ్చారన్నారు. అయితే, ఎన్నికలు సమీపించినందునే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారని ఆరోపించారు. సమయం మించిపోయిందని.. ప్రజలు వారికి జరిగిన అన్యాయాన్ని గుర్తించారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ సర్కార్కు ముగింపు పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. దీన్ని మమతా బెనర్జీ గుర్తించి నడుచుకోవాలని హితవు పలికారు. వివిధ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున బెంగాల్కు చేకూరిన లబ్ధిని ఈ సందర్భంగా నడ్డా వివరించారు. అనంతరం మాల్దా గ్రామంలో రైతులతో కలిసి ఆయన భోజనం చేశారు.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM