Dharmana Prasad Rao: పవన్‌ పోస్టర్‌ చూసి మంత్రి ధర్మాన ప్రసాదరావు అసహనం!

ప్రజా జీవితం మాటలు చెప్పినంత ఈజీ కాదని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. అధికారంతో సంబంధం లేకుండా 45 ఏళ్లు ప్రజాజీవితంలో ఉన్నానని

Published : 09 Aug 2022 01:26 IST

శ్రీకాకుళం: ప్రజా జీవితం మాటలు చెప్పినంత సులువు కాదన్నారు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అధికారంతో సంబంధం లేకుండా 45ఏళ్లు ప్రజాజీవితంలో తాను ఉన్నానని చెప్పారు. సీఎం జగన్‌ మాటిచ్చి నిలబెట్టుకున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని లింగాలవలసలో నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సమీపంలో ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోస్టర్‌లో స్థానిక యువత ఫొటోలు చూసి ఒకింత అసహనం వ్యక్తంచేశారు. ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వాన్ని గుర్తించాలే తప్ప సినిమా పోస్టర్ల మీద ఫోజులిచ్చి ఫొటోలు దిగితే ప్రయోజనం ఉండదన్నారు. ‘‘సినిమా వేరు.. నిజజీవితం వేరు.. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులుంటాయి. పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా నడుస్తానంటున్నారు.. అది సాధ్యమా? పవన్‌ను నాతో నడవమనండి.. ఆయన రాజకీయాల్లో 3 కి.మీలు కూడా నాతో నడవలేరు. సినిమాలో బొమ్మలు పెట్టి యాక్షన్‌ చేస్తారు. నాకు 64 ఏళ్లు.. ఆయన నాతో నడవగలరా? ప్రజా జీవితం మాటలు చెప్పినంత సులువేం కాదు’’ అని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని