Gudivada Amarnath: ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిందేంటో దిల్లీ పెద్దలు చెప్పాలి: మంత్రి అమర్నాథ్‌

ఏ పార్టీపై ఆధారపడే పరిస్థితి వైకాపాకు లేదని ఏపీ మంత్రి అమర్నాథ్‌ స్పష్టం చేశారు. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్‌ షా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఒక్కమాటా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు.

Updated : 12 Jun 2023 20:30 IST

అమరావతి: ఏ పార్టీపై ఆధారపడే పరిస్థితి వైకాపాకు లేదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్‌ షా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఒక్క మాటా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. పథకాలన్నీ ఎంతో దయతో కేంద్రం ఇస్తున్నట్లు అమిత్‌షా మాట్లాడారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రాల పన్నుల నుంచే పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోంది. ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిందేంటో దిల్లీ పెద్దలు చెప్పాలి. స్టీల్‌ ప్లాంట్‌, ప్రత్యేక హోదాపై ఏపీకి కేంద్రం చేసిందేమీ లేదు. పోలవరం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం లేదు. ఒక్క సీటు కూడా లేకుండానే 20 లోక్‌సభ సీట్లు కావాలట’’ అని మంత్రి అమర్నాథ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు