ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది.   మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల..

Updated : 11 Feb 2021 17:30 IST

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు  కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి-హైదరాబాద్‌, ఖమ్మం-వరంగల్‌-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే వివిధ పార్టీలు...అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 16న నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఎన్నికల ప్రక్రియ ఇలా..

* నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 23
* నామినేషన్ల పరిశీలన -ఫిబ్రవరి 24
* నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ- ఫిబ్రవరి 26
* పోలింగ్‌- మార్చి 14 ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
* ఓట్ల లెక్కింపు మార్చి - 17

 

ఇవీ చదవండి..

హైదరాబాద్‌ మేయర్‌గా విజయలక్ష్మి

స్వేచ్ఛనిచ్చాం.. కానీ చట్టాలను పాటించాల్సిందే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని