Telangana News: పంట రుణాలపై 4శాతం వడ్డీ రాయితీ కల్పించాలి: జీవన్రెడ్డి
శాసనమండలి సమావేశాలు కేవలం 4రోజులు మాత్రమే నిర్వహించడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశాల్లో వ్యవసాయ సమస్యలపై స్పష్టత
హైదరాబాద్: శాసనమండలి సమావేశాలు కేవలం 4రోజులు మాత్రమే నిర్వహించడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశాల్లో వ్యవసాయ సమస్యలపై స్పష్టత ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జీవన్రెడ్డి మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని ప్రచారం చేస్తూ వ్యవసాయ రాయితీలు నిలిపివేశారని ఆరోపించారు. పంట రుణాలపై 4శాతం వడ్డీ రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. రూ.35 వేల వరకే రుణమాఫీ చేసిందన్నారు. మిగిలిన అప్పు మాఫీకి సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో వరి కోతలు మొదలవుతాయని.. ధాన్యం సేకరణపై రైతులు అందోళన చెందుతున్నారని వెల్లడించారు. నిజాం చక్కెర కర్మాగారంపై మండలిలో లేవనెత్తితే ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదని జీవన్ రెడ్డి ఆక్షేపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.