PM Modi: కేసీఆర్ ఎన్డీయేలో చేరతామన్నారు: మోదీ
రానున్న ఎన్నికల్లో తెలంగాణ తల్ల్లులు, చెల్లెమ్మలు ఓట్ల రూపంలో భాజపాను ఆశీర్వదించాలని ప్రధాని మోదీ కోరారు.
ఇందూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ వైఖరి పూర్తిగా మారిపోయిందన్నారు. కేసీఆర్ దిల్లీ వచ్చి తనను కలిశారని, ఎన్డీయేలో చేరతామని, తెలంగాణలో కేటీఆర్ను ఆశీర్వదించాలని కోరినట్లు చెప్పారు. అయితే, ఇది రాజరికం కాదని చెబుతూ, భారాసతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ రోజే తేల్చి చెప్పినట్లు మోదీ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. ఇందూరు గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన భాజపా జనగర్జన సభలో ప్రసంగించారు.
ఓ రహస్యం ఇవాళ మీకు చెబుతున్నా..
‘‘ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం ఇవాళ మీకు చెబుతున్నా. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ వైఖరి పూర్తిగా మారిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ దిల్లీ వచ్చి నన్ను కలిశారు. నాపై ఎంతో ప్రేమ ఒలకబోశారు. కేసీఆర్ గతంలో ఎన్నడూ అంత ప్రేమ చూపలేదు. అది ఆయన వ్యక్తిత్వంలోనే లేదు. నా నేతృత్వంలోనే దేశం దూసుకుపోతోందని కేసీఆర్ భజన చేశారు. తెలంగాణ పాలనా పగ్గాలు కేటీఆర్కు ఇస్తానని చెప్పారు. ఆయన్ను ఆశీర్వదించాలని కోరారు. ఇది రాజరికం కాదని నేను కేసీఆర్కు గట్టిగా చెప్పా. ప్రజలు ఆశీర్వదించిన వారే పాలకులని, భారాసతో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పాను. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో మద్దతివ్వాలని అడిగారు. విపక్షంలోనైనా కూర్చుంటాం కానీ, మద్దతు ఇవ్వనని తెగేసి చెప్పాను. తెలంగాణ ప్రజలకు ద్రోహం చెయ్యనని కేసీఆర్కు స్పష్టం చేశాను. కేసీఆర్ కోరినా.. భారాస ఎన్డీయేలో చేరేందుకు నేను అంగీకరించలేదు’’ అని మోదీ అన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంది..
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరఫున గట్టిగా పోరాడాలని భాజపా నిర్ణయించిందని మోదీ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారమైందన్న మోదీ.. రాష్ట్ర ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. ప్రజాస్వామ్య కుటుంబాన్ని భారాస కుటుంబ స్వామ్యంగా మార్చిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు భాజపాను ఆశీర్వదించాలని ప్రధాని మోదీ కోరారు.
కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దు..
కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ల బిల్లు రూపొందించుకున్నట్లు గుర్తు చేసిన ఆయన.. భరతమాత రూపంలో సభకు వచ్చిన మహిళలకు అభినందనలు తెలిపారు. ‘‘మహిళలు పెద్ద సంఖ్యలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్లో మరింత మహిళా శక్తిని మనం చూడనున్నాం. తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు ఓట్ల రూపంలో భాజపాను ఆశీర్వదించాలి. తెలంగాణ ప్రజల్లో ఎంతో శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయి. ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత తెలంగాణదే’’ అని మోదీ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందని, కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు. తెలంగాణ యువత కుటుంబ పాలనకకు మరో అవకాశం ఇవ్వొద్దని మోదీ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Purandeswari: ఓట్ల కోసమే ‘నాగార్జునసాగర్’ వివాదం: పురందేశ్వరి
ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని నాగార్జునసాగర్ వద్ద నీటి విడుదల అంశాన్ని వివాదాస్పదం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. -
Nara Lokesh: వంద రోజుల్లో.. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం
తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని, ఈ అంశంపై పవన్ కల్యాణ్ అన్నతో తొలి సమావేశంలోనే చర్చించామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. -
‘విశాఖ ఉత్తరం’ అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తామనే ధీమాతో సీఎం జగన్ ఉన్నారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. -
భాజపాను అధికారంలోకి రానివ్వం: బీవీ రాఘవులు
కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా భాజపాను అడ్డుకుంటామని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తేల్చిచెప్పారు. -
ఎన్నికల్లో లబ్ధికోసమే నాటకాలు: రామకృష్ణ
తెలంగాణ ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ నీటి వివాదం పేరుతో కొత్త డ్రామాకు తెర తీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. -
నీటి కోసం దొంగ యుద్ధం: రఘురామ
తెలంగాణలో ఎన్నికలు జరిగే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటికోసం దొంగ యుద్ధం చేసేందుకు ప్రయత్నించిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
విశాఖను ఫైనాన్షియల్ హబ్గా ప్రకటించాలి: ధర్మాన
విశాఖను ఫైనాన్షియల్ హబ్గా ప్రకటించాలని, దీనికి అవసరమైన చర్యలను చేపట్టాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని కోరారు. -
నేడు తెదేపా పార్లమెంటరీ పార్టీ భేటీ
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం జరగనుంది. డిసెంబరు 4 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చించనున్నారు. -
రోడ్లను బురద గుంతల్లా మార్చినందుకు మళ్లీ జగన్ కావాలా?
రాష్ట్రంలోని రహదారుల్ని బురద గుంతల్లా మార్చినందుకు సీఎం జగన్ మళ్లీ కావాలా అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
బీసీల మధ్య చిచ్చు పెట్టడానికే ‘కులగణన’
బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికే సీఎం జగన్ కులగణనను తెరపైకి తెచ్చారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. -
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడమే పొన్నవోలు లక్ష్యం
తెదేపా అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, వ్యక్తిగతంగా ఆయన్ను పలచన చేయడమే లక్ష్యంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి పని చేస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
దేశమంతా రాజస్థాన్ తరహా ఆరోగ్య పథకం
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన ఆరోగ్య పథకం ఆదర్శప్రాయంగా ఉందని, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఈ పథకాన్ని అమలుచేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. -
5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు.. రూ.2 వేల కోట్ల విలువైన జప్తులు
దేశంలో శాసనసభ ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పలు సందర్భాల్లో కొరడా ఝళిపించింది. -
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో భాజపా ఓడితే.. గోవాలోని ప్రమోద్ సావంత్ సర్కార్ కుప్పకూలిపోతుందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Purandeswari: ఓట్ల కోసమే ‘నాగార్జునసాగర్’ వివాదం: పురందేశ్వరి
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
-
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు