Komatireddy: ఫోన్‌లో బెదిరింపులు.. ఎంపీ కోమటిరెడ్డిపై కేసు

భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy)పై కేసు నమోదైంది.

Published : 07 Mar 2023 12:19 IST

నల్గొండ: భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy)పై కేసు నమోదైంది. ఇటీవల టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కుమారుడు సుహాస్‌ను ఫోన్‌లో కోమటిరెడ్డి బెదిరించినట్లు ఆడియో క్లిప్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో తనకు ప్రాణహాని ఉందంటూ సుహాస్‌ నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదు మేరకు నల్గొండ వన్‌టౌన్‌ పోలీసులు 506 సెక్షన్‌ కింద ఎంపీపై కేసు నమోదు చేశారు.  కోమటిరెడ్డి బెదిరింపులపై సోమవారం జిల్లా ఎస్పీకి కూడా సుహాస్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని