Pawan kalyan: ‘నా వద్ద రూ.వేల కోట్లు.. సుపారీ గ్యాంగులు లేవు’: పవన్ కల్యాణ్
వైకాపా ప్రభుత్వం 70:30 ప్రభుత్వమని.. వంద మంది కష్టాన్ని 30 మందికి పంచి ఓటు బ్యాంకు చేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.
ముమ్మిడివరం: వైకాపా ప్రభుత్వం 70:30 ప్రభుత్వమని.. వంద మంది కష్టాన్ని 30 మందికి పంచి ఓటు బ్యాంకు చేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వైకాపా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు.
‘‘నా వద్ద రూ.వేల కోట్లు లేవు.. సుపారీ గ్యాంగులు లేవు. జాతీయ నేతల స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా. మన అనైక్యత వల్లే కొంత మంది నేతలు మనల్ని భయపెడుతున్నారు. కోనసీమలో పెట్రోల్ ఉంది కదా.. అందుకే ఇక్కడి వారిలో ఉద్వేగం ఎక్కువ. కోనసీమలో ఇంకా తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మంచి ఆస్పత్రి కూడా లేదు. కోనసీమలో బాలయోగి అనేక మంచి పనులు చేశారు. ఒక్క వ్యక్తి అన్ని మంచి పనులు చేస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని పనులు చేయాలి? ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల ప్రజలకు నేను అండగా ఉంటా. ఈ సీఎం.. ఒక ఎంపీని కొట్టించగలరు. ఒక ఎమ్మెల్సీ.. ఎస్సీ వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేయగలరు. చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని సీఎం శభాష్ అంటారు. కోనసీమకు అంబేడ్కర్ జిల్లాగా పేరు పెడితే గొడవలు జరిగాయి. అంబేడ్కర్ పేరును వ్యతిరేకించిన వర్గాలకు సీఎం నచ్చజెప్పాలి. మనం అనైక్యంగా ఉంటే మళ్లీ వైకాపా ప్రభుత్వమే వస్తుంది. ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడాలి.. అందరినీ కలపాలి. 80 మంది అనైక్యంగా ఉంటే.. 20 మంది ప్రభుత్వమే వస్తుంది.
కులం గురించి మాట్లాడేది నేనా.. మీరా..?
వైకాపా ప్రభుత్వం.. ఉప్మా ప్రభుత్వం. కులం గురించి మాట్లాడితే వైకాపా నేతలకు ఇబ్బందిగా ఉంది. కులం గురించి మాట్లాడేది నేనా.. మీరా..?కులాల గురించి మీరు మాట్లాడవచ్చు.. నేను మాట్లాడకూడదా? మీరు మాత్రం అమరావతికి కులాలు అంటగట్టవచ్చా? కేవలం రెండు కులాలే ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవాలంటే కుదరదు. అన్ని కులాలు బాగుపడాలి.. పైకి రావాలి. ద్వారంపూడి కుటుంబంలో అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. ప్రజలను కలిపేవాడే నాయకుడు.. విడగొట్టేవాడు కాదు.
యువతకు పెట్టుబడి కింద ఉచితంగా రూ.10లక్షలు సాయం..
రైతుల కష్టాలను పోగొట్టే ప్రభుత్వం మనకు కావాలి. రైతులు దూరంగా ఉండే మిల్లులకు ధాన్యం తీసుకెళ్తున్నారు. మేం వచ్చాక దగ్గరున్న మిల్లులకే ధాన్యం తరలిస్తాం. 3 పంటలు పండే చోటు రైతులు ఒక్క పంటకే పరిమితం అయ్యారు. నదుల నుంచి ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఇసుక దోపిడీని అరికడతాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. యువతకు పెట్టుబడి కింద ఉచితంగా రూ.10లక్షలు ఇస్తాం. కోనసీమ జిల్లాలో పూడికలు సరిగా తీయడం లేదు. కాలువల్లో పూడిక తీయక రైతులు నష్టపోతున్నారు. నేను వస్తున్నానంటే చాలు.. రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. ఏపీ నాయకుల దోపిడీ వల్ల తెలంగాణ నేతలు మనల్ని తిట్టారు. ఆంధ్రా వాళ్లం అనే భావన లేకుంటే అందరం నష్టపోతాం. కీలకమైన పదవులను రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తారా? మిగతా కులాల వారిలో ప్రతిభ లేదా.. ఒక్క కులానికే ఉందా? గట్టిగా అడిగేవాడు ఉంటే చాలు.. ఎవరైనా భయపడతారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడే ఉన్నా. వచ్చే ఎన్నికల్లో నాకు అండగా నిలబడండి’’ అని పవన్ కల్యాణ్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!