Pawan Kalyan: అరాచకం ఆగాలి.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలి: పవన్‌ కల్యాణ్‌

హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పదో రోజు వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు.

Updated : 23 Jun 2023 20:55 IST

పి.గన్నవరం: హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పదో రోజు వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన నియోజకవర్గ నేతలతో పవన్‌ సమావేశమయ్యారు. ఆ తర్వాత రోడ్‌ షో నిర్వహించారు. బండారులంక మీదుగా అంబాజీపేట చౌరస్తాకు చేరుకుని అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం పీ.గన్నవరం చేరుకుని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఒకటే లక్ష్యం. అరాచకం ఆగాలి.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలి. జనం బాగుపడాలంటే జగన్‌ పోవాలి’’ అని ఈ సందర్భంగా పవన్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు