BJP: వారసత్వ పార్టీలతో దేశ ప్రజలు విసిగిపోయారు: రవిశంకర్ ప్రసాద్
హెచ్ఐసీసీ వేదికగా హైదరాబాద్లో రెండ్రోజుల పాటు జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి.
హైదరాబాద్: హెచ్ఐసీసీ వేదికగా హైదరాబాద్లో రెండ్రోజుల పాటు జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. సమావేశం ముగిసిన తర్వాత సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు. ‘‘దేశానికి భాజపా అవసరం గురించి కార్యవర్గ సమావేశాల్లో మోదీ సవివరంగా చెప్పారు. సర్దార్ పటేల్ విశాల భారతదేశాన్ని కాంక్షించారు. పటేల్ కృషి వల్లే భారత్లో తెలంగాణ విలీనమైంది. బంగాల్, కేరళలో భాజపా శ్రేణులపై దాడులు జరిగాయి. కేరళ, తెలంగాణలో మా కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్, సబ్కా సాత్.. సబ్కా వికాస్ మన నినాదమని మోదీ చెప్పారు. సుదీర్ఘ కాలం పాలించిన పార్టీలు ఇప్పుడు నిష్క్రమణ దారిలో ఉన్నాయి. కరోనా రూపంలో అందరికీ పెద్ద సవాల్ ఎదురైంది. కానీ, ప్రధాని మోదీ దూరదృష్టితో సవాలును అధిగమించాం. వారసత్వ పార్టీలతో దేశ ప్రజలు విసిగిపోయారు. దేశ వ్యాప్తంగా భాజపా విస్తరిస్తోంది. దేశంలో సర్వజనహితం కాంక్షించి పాలన సాగిస్తున్నాం’’ అని రవిశంకర్ ప్రసాద్ వివరించారు.
తెలంగాణలో మంచి కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రెండ్రోజులుగా నియోజకవర్గాల్లో భాజపా ముఖ్యనేతలు ప్రజల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో అన్ని అంశాలు పరిశీలించారని తెలిపారు. ఎస్సీ వాడలకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారని, అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావాలనేది ప్రధాని ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేయాలని మోదీ ఆకాంక్షించారని తెలిపారు. గిరిజన మహిళను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలని మోదీ నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూ వివిధ రంగాల్లో అనుభజ్ఞురాలని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని తెలిపేలా రాష్ట్ర భాజపా నేతలు హెచ్ఐసీసీలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ పోరాటం, భాజపా తెలంగాణ చరిత్ర తెలిపేలా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ఇప్పటికే పలువురు నేతలు సందర్శించారు. సమావేశాలకు విచ్చేసిన ముఖ్య నాయకులంతా ఎగ్జిబిషన్ను తిలకించాలని రాష్ట్ర నేతలు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.