Vande Bharat: వందే భారత్‌కు ఎందుకంత ప్రచారం?.. సామాన్యులకు అందుబాటులో లేదు: పొన్నాల

తెలుగు రాష్ట్రాల మధ్య ఇవాళ ప్రారంభమైన వందే భారత్‌ రైలు సామాన్యులకు అందుబాటులో లేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. 

Published : 16 Jan 2023 01:57 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య కొత్తగా ప్రవేశ పెట్టిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది కాదని, కేవలం ధనికులకు ఉపయోగపడేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. పండగపూట రాజకీయాలు మాట్లాడకూడదనుకున్నానని కానీ, మాట్లాడక తప్పడం లేదన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని, ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్‌ అందరూ ఒక రైలుకు విస్తృత ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. వందే భారత్‌ రైలును సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగింపుగా ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారన్నారు. కానీ, ఇది మొదటి రైలు కాదని, ఇప్పటి వరకు రోజు, వారాంతాల్లో నడిచేవి ఇప్పటి వరకు 17 రైళ్లు ఉన్నాయని, వందే భారత్‌ 18వది అని విమర్శించారు. ప్రజోపయోగ కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా కొత్త పేర్లు, కొత్త నినాదాలు, ప్రచారాలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పార్లమెంట్‌ సాక్షిగా చేసిన విభజన చట్టంలోని అంశాలు 8ఏళ్లలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని