Revanth reddy: రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 6 కార్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో అపశృతి చోటుచేసుకుంది.కాన్వాయ్‌లోని ఒక కారులో ప్రయాణిస్తున్న పలువురు మీడియా రిపోర్టర్లకూ గాయాలయ్యాయి.

Updated : 04 Mar 2023 13:13 IST

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో అపశృతి చోటుచేసుకుంది. అతివేగంతో అదుపుతప్పి రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రేవంత్‌రెడ్డికి చెందిన 4 కార్లతో పాటు 2 న్యూస్‌ ఛానళ్ల కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాద తీవ్రతకు కార్లలోని బెలూన్లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఒక కారులో ప్రయాణిస్తున్న పలువురు మీడియా రిపోర్టర్లు గాయపడినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని