Revanth Reddy: జోడో యాత్రకు భయపడే.. ఈ కుట్రలు కుతంత్రాలు: రేవంత్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భయపడి భాజపా కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈడీ పేరుతో పార్టీ నాయకులను వేధిస్తోందని విమర్శించారు. గాంధీ భవన్లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ముఖ్య నాయకులను ఈడీ కేసులతో భయపెట్టి కాషాయ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోందన్నారు.
హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భయపడి భాజపా కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈడీ పేరుతో పార్టీ నాయకులను వేధిస్తోందని విమర్శించారు. గాంధీ భవన్లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ముఖ్య నాయకులను ఈడీ కేసులతో భయపెట్టి కాషాయ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోందన్నారు. ‘‘రాహుల్ పాదయాత్రతో మార్పు వస్తుందనే ఉద్దేశంతోనే గతంలో మూసేసిన హెరాల్డ్ కేసును మళ్లీ తెరిచారు. ఈడీ అధికారులను ఉసిగొల్పి రాహుల్ గాంధీని విచారణకు పిలిచారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా.. ఆమెను విచారణకు పిలిచి వేధించారు. అయినప్పటికీ భారత్ జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల నేతలకు నోటీసులు ఇస్తున్నారు. కర్ణాటకలో యాత్రను అడ్డుకోవడానికి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ను ఈడీ విచారణకు పిలిచింది. ఏయే రాష్ట్రాల్లో పాదయాత్ర ఉందో.. అక్కడి నేతలకు ఈడీ నోటీసులిస్తోంది’’ అని రేవంత్ అన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని భాజపా ‘ఎలక్షన్ డిపార్ట్ మెంట్’గా మార్చుకుందని రేవంత్ విమర్శించారు. ‘‘గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లాంటి క్రియాశీల నాయకులకు ఈడీ నోటీసులిచ్చింది. రూ.కోటి చందా ఇచ్చినందుకు ఐదుగురు నేతలకు నోటీసులిచ్చారు. వారిని భయపెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలని చూస్తున్నారు’’ అని రేవంత్రెడ్డి అన్నారు. భాజపాకు చందాలిచ్చిన ఏ ఒక్కరికైనా నోటీసులిచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. గత ఆరేడేళ్లలో భాజపాకు రూ.4,841 కోట్ల చందాలు వచ్చాయి అని రేవంత్ అన్నారు.
కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంలా మారిందని చెబుతున్న భాజపా.. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై వివరాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ‘‘బంగారు కూలీ పేరుతో కోట్ల రూపాయలు తెరాస వసూలు చేసిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశాను. అయినా చర్యలు లేవు. తొడుక్కోవడానికి అంగీలు లేని కార్యకర్తలున్న తెరాసకు.. రూ.800 కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయి?’’ అని రేవంత్ ప్రశ్నించారు. దిల్లీలో అత్యంత విలువైన ప్రాంతంలో తెరాస పార్టీ ఆఫీసుకు స్థలం కేటాయించారని, కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి ముందస్తు ఒప్పందంలో భాగంగానే తెరాసకు స్థలం ఇచ్చారని రేవంత్ ఆరోపించారు.
ఈడీ నోటీసులు.. వెనకున్న కుట్రలేంటి?
కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడం వెనకున్న కుట్రను ప్రజలు గమనించాలని రేవంత్ కోరారు. కాంగ్రెస్లో చేరాలనుకున్న వారిని భయపెట్టి భాజపాలో చేర్చుకుంటున్నారన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ ఎందుకు విచారణ జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ మనోధైర్యాన్ని ఈడీ, ఇన్కం ట్యాక్స్, సీబీఐ దెబ్బతీయలేవన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్కు అవకాశమిస్తే గుణాత్మక మార్పును తీసుకొస్తామని రేవంత్ అన్నారు. 11 రాష్టాల్లో ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా భాజపా ప్రభుత్వాలను ఏర్పాటు చేసున్నారని రేవంత్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
PM Modi: ప్రధాని మోదీకి ‘స్టాండింగ్ ఒవేషన్’.. ప్రత్యేక సన్మానం
PM Modi: ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా అద్భుత ప్రదర్శన నేపథ్యంలో ప్రధాని మోదీని ఆ పార్టీ ఘనంగా సత్కరించింది. -
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
బాపట్ల జిల్లా (Bapatla district)లోని బర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు. -
సమన్వయం పెంచుకుందాం
కూటమిలోని పార్టీల మధ్య సమన్వయాన్ని పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలని, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ నేతలు నిర్ణయించారు. -
గోమూత్ర వ్యాఖ్యలకు లోక్సభలో ఎంపీ క్షమాపణ
తాను చేసిన గోమూత్ర వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ బుధవారం లోక్సభలో క్షమాపణలు చెప్పారు. -
చంద్రబాబుతో పవన్ భేటీ
తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. -
పోలిపల్లిలో యువగళం ముగింపు సభ!
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 17న నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. -
దోచుకోవడంపై ఉన్నశ్రద్ధ.. రైతుల్ని ఆదుకోవడంలో లేదా?
నదీగర్భాల్ని తొలిచి మరీ ఇసుక దోచుకోవడంపై సీఎం జగన్ చూపిస్తున్న శ్రద్ధలో కొంచెమైనా తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని, సర్వస్వం కోల్పోయిన ప్రజల్ని ఆదుకోవడంలో లేదని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. -
రూ.1,233 కోట్ల కేటాయింపులు ఎవరికి దోచిపెట్టడానికి?
‘తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించలేరు.. భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం పెట్టలేరు కానీ.. భూమన కరుణాకర్రెడ్డి తితిదే బోర్డు ఛైర్మన్ అయిన మూడు నెలల్లో బడ్జెట్లో చూపకుండా వివిధ కాంట్రాక్టుల కింద రూ.1,233 కోట్లు కేటాయిస్తారా? -
మంచినీళ్లు కూడా ఇవ్వరా?
మిగ్జాం తుపానును ఎదుర్కోవడం, బాధితుల్ని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
రైతాంగాన్ని ఆదుకోవాలి
తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు. -
సీఎం బయటికి రారేం?
మిగ్జాం తుపాను ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సీఎం జగన్ ఒక చిన్న సందేశమిచ్చి ఇంట్లో కూర్చోవడం చూస్తే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లుగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
ఏపీ అప్పు రూ.11.28 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు దొరకకుండా ఉండటానికి కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేస్తోందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.11.28 లక్షల కోట్లకు చేరాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. -
అంచనాలకు మించి తుపాను నష్టం
తుపాను నష్టం అంచనాలకు మించి ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. -
రేవంత్ అంచెలంచెలుగా ఎదిగారు
తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారని కొనియాడారు.


తాజా వార్తలు (Latest News)
-
Vijay: మిగ్జాం తుపాను.. అభిమానులంతా సాయం చేయాలని పిలుపునిచ్చిన విజయ్
-
CM Jagan: ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
-
US Presidential Debate: వివేక్ ఆరోపణలు.. మౌనంగా ఉండిపోయిన నిక్కీ హేలీ
-
Hyderabad: ప్రగతిభవన్ ముందు బారికేడ్లు, గ్రిల్స్ తొలగింపు
-
Sreesanth-Gambhir: సహచరులతో గొడవపడతాడు.. సీనియర్లకు గౌరవం ఇవ్వడు: గంభీర్పై శ్రీశాంత్
-
USA: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురి మృతి