Bandi Sanjay: బండి సంజయ్కు దిల్లీ నుంచి పిలుపొస్తుందా?
తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్కు అదిష్ఠానం నుంచి పిలుపు వచ్చే అవకాశముందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చే అవకాశముందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొద్దిరోజులుగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడి మార్పు జరగనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సంజయ్కు కేంద్రమంత్రి పదవి ఇచ్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం హనుమకొండలో సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ సభకు అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో తెలియదు. హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం. మోదీ సభను విజయవంతం చేయాలి’’ అని కార్యకర్తలతో ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో సంజయ్కు దిల్లీ నుంచి పిలుపు రావొచ్చనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది.
ముంబయి వెళ్లిన సంజయ్
బండి సంజయ్ నేడు ముంబయి పర్యటనకు వెళ్లారు. అక్కడి ముంబ మహాదేవి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భాజపా అధిష్ఠానం నుంచి సాయంత్రంలోపు సంజయ్కు పిలుపు రావొచ్చని ప్రచారం జరుతోంది. ఈ నేపథ్యంలో పిలుపు వస్తే సంజయ్ ముంబయి నుంచే నేరుగా దిల్లీ వెళ్లే అవకాశముంది.
జితేందర్రెడ్డిని కలవనున్న ఈటల
మరోవైపు మాజీ ఎంపీ, భాజపా నేత జితేందర్రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ను కొనసాగించాలని జితేందర్రెడ్డి వర్గం కోరుతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసేందుకు ఈటల వెళుతుండటం ఆసక్తికరంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు