Andhra News: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే తప్పేంటి?: సజ్జల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హత లేని కొంతమంది తెదేపా కార్యకర్తలు గడప గడపకు వైకాపా కార్యక్రమంలో ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ప్రభుత్వ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హత లేని కొంతమంది తెదేపా కార్యకర్తలు గడప గడపకు వైకాపా కార్యక్రమంలో ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి జరుగుతుంటే కడుపు మంట తట్టుకోలేక తెదేపా అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. వైకాపా కార్యకర్తలెవరూ అసంతృప్తిగా లేరని.. తెదేపా శ్రేణులే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మూడేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చూడాలంటే ఓడిపోయిన తెదేపా నేతలు, అభ్యర్థులను గడప గడపకు కార్యక్రమానికి పంపాలన్నారు. ధైర్యం ఉంటే జరుగుతున్న వాటన్నింటినీ వీడియో తీసిపెట్టాలని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేని కౌలు రైతులంటూ ఎవరూ లేరని సజ్జల స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు వెనుక డొంక తిరుగుడు వ్యవహారం ఏదీ లేదని.. రైతులకు శాశ్వతంగా లబ్ధి, విద్యుత్ శాఖ, సిబ్బందికి జవాబుదారీతనం ఉండేందుకే మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే తప్పేంటని.. మీటర్ల ఏర్పాటు వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందన్నారు. మీటర్ల ఏర్పాటుపై రైతులను తెదేపా అధినేత చంద్రబాబు రెచ్చగొడుతున్నారని సజ్జల విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.