Ysrcp: మచిలీపట్నం వైకాపా ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్‌రావు

కృష్ణా జిల్లా వైకాపాలో మార్పుల పరంపర కొనసాగుతోంది.

Updated : 07 Mar 2024 22:28 IST

అమరావతి: కృష్ణా జిల్లా వైకాపాలో మార్పుల పరంపర కొనసాగుతోంది. అవనిగడ్డ వైకాపా ఇన్‌ఛార్జిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, మచిలీపట్నం ఎంపీ బరిలో రమేష్‌బాబును నిలబెడుతున్నట్లు ఇటీవల వైకాపా అధిష్ఠానం ప్రకటించింది. అయితే.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చంద్రశేఖర్‌రావు విముఖత వ్యక్తం చేయడంతో మరోసారి మార్పులు చేసింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు చంద్రశేఖర్‌రావును మచిలీపట్నం పార్లమెంట్‌ సమన్వయకర్తగా, రమేష్‌బాబును అవనిగడ్డ ఇన్‌ఛార్జిగా నియమించినట్టు వైకాపా కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు