దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు: మోదీ
దేశంలోని టీ పరిశ్రమను భంగపరచడం ద్వారా.. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు విదేశాల నుంచి కుట్రలు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు మోదీ ఆదివారం అసోంలోని సొంటిపూర్ జిల్లాలో నిర్వహించిన టీ కార్మికుల సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ ఆ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం రూ.8వేల కోట్లతో తలపెట్టిన ‘అసోం మాల’ పథకానికి శంకుస్థాపన చేశారు.
దిల్లీ: దేశంలోని టీ పరిశ్రమపై అసత్య ప్రచారం చేసి.. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు విదేశాల నుంచి కుట్రలు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అలాంటి కుట్రలు చేస్తున్న వారికి దేశీయంగా మద్దతు పలికే రాజకీయ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మోదీ ఆదివారం అసోంలోని సొంటిపూర్ జిల్లాలో నిర్వహించిన టీ కార్మికుల సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ ఆ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం రూ.8వేల కోట్లతో తలపెట్టిన ‘అసోం మాల’ పథకానికి శంకుస్థాపన చేశారు.
‘ప్రస్తుత రోజుల్లో దేశంలోని టీ పరిశ్రమకు వ్యతిరేకంగా బయటి దేశాల నుంచి కొందరు కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల ద్వారా దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఇటీవల కొన్ని నివేదికలు బయటపెట్టాయి. ఆ కుట్రదారులకు మద్దతు పలుకుతున్న రాజకీయ పార్టీలను ప్రతి టీ తోట కార్మికుడు నిలదీయాలి. అలాంటి వారికి టీ కార్మికులంతా దీటైన జవాబు ఇస్తారని నేను భావిస్తున్నా’ అని మోదీ వెల్లడించారు.
‘‘స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రతి రాష్ట్రంలో కనీసం ఓ వైద్యశాల, ఓ సాంకేతిక కళాశాల నెలకొల్పాలనేది నా కల. వైద్యులు మాతృభాషలో ప్రజలకు దగ్గరైనప్పుడే వారి ఇబ్బందులు అర్థం చేసుకోగలుగుతారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య సేవలు మెరుగవుతాయి. అసోంలో గత ఐదేళ్లలో కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధి జరిగింది. వైద్యారోగ్య, మౌలిక సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇప్పుడు ప్రారంభించిన ‘అసోం మాల’ పథకం ద్వారా ప్రజలకు ఇంకా మరిన్ని అవకాశాలు వస్తాయి’’ అని మోదీ తెలిపారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే