Somireddy: మంత్రి అల్లుడి కంపెనీ కోసం రైతుల భూములు కాజేస్తారా?: సోమిరెడ్డి

సర్వేపల్లి నియోజకవర్గంలో భూకుంభకోణాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. 

Published : 10 Apr 2024 15:03 IST

నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో భూకుంభకోణాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. కలెక్టర్‌ జోక్యం చేసుకొని పేదల ఆస్తుల్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘రాష్ట్ర మంత్రి కాకాణి, ఆయన అల్లుడి కంపెనీ కోసం అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. సుధాకర్‌ అనే వ్యక్తికి కాకాణి అల్లుడు ఫోన్‌ చేసి బెదిరించారు. బినామీ కంపెనీ కోసం రైతుల నుంచి భూములు లాక్కున్నారు. ఇళ్ల పట్టాలను శాశ్వత పట్టాలుగా మార్చి జీవో తెచ్చారు. ఆ పట్టాలను వైకాపా నాయకులు తమ ఇళ్లలో పెట్టుకున్నారు. 40 ఏళ్ల నుంచి ఆధీనంలో ఉన్న భూములను కబ్జా చేస్తారా? కాకాణి భూ కబ్జాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? భూ అక్రమాలపై లోకాయుక్తకు వెళ్లాం. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. వెంటనే జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని ఆస్తులు కాపాడాలి. విచారణ జరిపించాలి’’అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని