పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు: సోమిరెడ్డి

నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ శాఖలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

Published : 12 Mar 2024 14:11 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ శాఖలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. సర్వేపల్లిలోనే రూ.300 కోట్ల పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారని మండిపడ్డారు. కాలువలు, షట్టర్ల మరమ్మతుల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని.. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారని ధ్వజమెత్తారు. నెల రోజుల కిందట ఈ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా.. స్పందించలేదన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. తప్పు చేసిన అధికారులు ఊచలు లెక్క పెట్టుకోవాల్సిందేనని హెచ్చరించారు. వీటి మీద నెల రోజుల్లో ప్రత్యేక విచారణ జరిపిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని