పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు.
15 ఏళ్లలో 5 రెట్లు.. 5 ఏళ్లలో రెట్టింపునకు మించి పెరిగిన ధర
అప్పట్లో కొంటే సంపద విలువ ఆ మేర పెరిగినట్లే
నేడు అక్షయ తృతీయ
ఈనాడు వాణిజ్య విభాగం
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. దేశీయంగా పసిడి, వెండి ధరలు ఇటీవలి గరిష్ఠస్థాయుల నుంచి కొంత తగ్గినా, ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. సమీపకాలంలో ధరల్లో దిద్దుబాటు వచ్చినా, అంతర్జాతీయ కారణాల వల్ల దీర్ఘకాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయనే అభిప్రాయాన్ని విక్రేతలు వ్యక్తం చేస్తున్నారు. గత 15 ఏళ్ల ధరలను పరిశీలిస్తే, బంగారం ధర 5 రెట్లకు పైగా పెరిగింది. గత అయిదేళ్లలోనే రెట్టింపునకు మించి ప్రతిఫలం అందించింది. బంగారాన్ని అట్టేపెట్టుకుంటే, కష్టాల్లో ఆదుకుంటుందనే భావన ప్రజల్లో ఉంది. మధ్యమధ్యలో ధర తగ్గినా, దీర్ఘకాలంలో చూస్తే, అధిక ప్రతిఫలాన్ని ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనల వల్ల, తగిన ధ్రువీకరణలు లేకుండా రూ.50,000కు మించి నగదు తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో, ఆభరణాల విక్రయాలపై ప్రభావం పడుతోందని చిన్న వ్యాపారులు పేర్కొంటున్నారు. సంఘటిత సంస్థలు మాత్రం ఆన్లైన్, కార్డులతో అధీకృత చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తున్నందున పెద్ద తేడా ఉండదంటున్నాయి. పాత ఆభరణాలను మార్చుకుని, కొత్తవి తీసుకున్నా.. తమకు తయారీ/తరుగు రూపేణ కలిసొస్తుందనే భావన వ్యాపారుల్లో ఉంది. అందుకే ఆభరణాలపై తయారీ ఛార్జీల్లో రాయితీలు, పాత ఆభరణాల మార్పిడికి ప్రోత్సాహకాలను ఇస్తున్నారు.
అక్షయం.. అంటే నాశనము లేనిది అని అర్థం. అక్షయతృతీయ నాడు పసిడి, వెండి ఆభరణాలు, ఇల్లు/ఫ్లాట్ కొనుగోలు చేసుకున్నా, వాటి విలువ మరింత పెరుగుతుందన్నది ఉత్తర భారతీయుల నమ్మకం. క్రమంగా ఈ అలవాటు తెలుగు రాష్ట్రాలకూ వ్యాపించింది. అయితే మరో 3 నెలల పాటు వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడం, బంగారం ధర మరీ ఎక్కువగా ఉన్నందున.. అమ్మకాలపై ప్రభావం ఉంటుందని భావిస్తున్న వ్యాపారులు, వివిధ రకాల ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. 2019 అక్షయ తృతీయ సమయంలో 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత) ధర రూ.32,450 కాగా, ఇప్పుడు రూ.73,900కు చేరింది. ధర ఇంతగా పెరిగిందంటే, అప్పుడు కొనుగోలు చేసిన వారి సంపద అధికమైందని, దీన్ని సానుకూల సెంటిమెంటుగా పరిగణించాలని వ్యాపారులు సూచిస్తున్నారు.
అంతర్జాతీయం కన్నా దేశీయ ధరలు అధికం
అయిదేళ్ల క్రితం అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 1270 డాలర్లు అయితే, ఇప్పుడు 2315 డాలర్ల వద్ద ఉంది. అప్పుడు డాలర్ విలువ రూ.69 కాగా, ఇప్పుడు రూ.83.50 సమీపంలో ఉంది. అప్పుడు దిగుమతి సుంకం, ఇతర పన్నులు కలిపి 13% అయితే, ఇప్పుడు 15.50% అయ్యింది. దాదాపు వ్యాపారులంతా, ఆన్లైన్ ధరల ప్రకారమే బంగారం ధర నిర్ణయిస్తున్నారు. అయితే ఆభరణాల తరుగు-మజూరు ఛార్జీలు/‘జతచేరుస్తున్న విలువ-వీఏ’, పేరుతో బంగారం ధరపై దాదాపు 10-20% అదనంగా వసూలు చేస్తున్నారు. ఇందువల్ల అంతర్జాతీయ విపణుల కంటే దేశీయంగా ధర మరింత ఎక్కువగా ఉంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
SBI Rewardz Fraud: తమ బ్యాంకు పేరిట వాట్సప్, ఎసెమ్మెస్ సందేశాల్లో వచ్చే లింకులపై క్లిక్ చేయొద్దని ఎస్బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. -
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
EPF auto settlement: నగదు ఉపసంహరణను సులభతరం చేయడం కోసం ఈపీఎఫ్ తీసుకొచ్చిన ఆటో సెటిల్మెంట్ సదుపాయం గురించి తెలుసా? -
టాటా మోటార్స్ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. -
జీడీపీ వృద్ధి 6.7శాతం!
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. -
కృత్రిమ మేధపై వ్యయాలు మూడింతలు
మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. -
2024లో ఈక్విటీ ఫండ్లలోకి రూ.1.3 లక్షల కోట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్ ఫండ్లు (ఎంఎఫ్) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం. -
మేమూ వినియోగించుకునే అవకాశమివ్వండి
విమాన ఇంధన (ఏటీఎఫ్) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రభుత్వాన్ని కోరింది. -
పసుపు కిందకు!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్కు మరిన్ని చిక్కులు
అగ్రగామి మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. -
చైనా స్థిరాస్తి రంగానికి ఊరట
దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది. -
భారత్ వృద్ధి 6.6%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. -
సంక్షిప్త వార్తలు
ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ వైదొలగనున్నారు. -
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన