T Rajaiah: కారు దిగిన రాజయ్య.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భారాసను వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated : 03 Feb 2024 18:21 IST

జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భారాసను వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లేఖను మీడియాకు చూపించారు. ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారాసలో మానసిక క్షోభకు గురయ్యా. పార్టీలో నాకు సరైన గుర్తింపు లభించడం లేదు. పార్టీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశమే దక్కడం లేదు. కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంది. వారితో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా. పార్టీ విధివిధానాలు నచ్చట్లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామనడం సరికాదు. నేను 15 ఏళ్లు కాంగ్రెస్‌లోనే ఉన్నాను. కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ కోసం పోరాడా’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని