Ts News: తెరాస నేతల ఉల్లంఘనలు పోలీసులకు కనిపించడం లేదా?: కిషన్రెడ్డి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. దిల్లీలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జీవోపై నిరసన తెలిపేందుకే బండి సంజయ్ దీక్ష చేశారని పేర్కొన్నారు...
దిల్లీ: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. దిల్లీలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జీవోపై నిరసన తెలిపేందుకే బండి సంజయ్ దీక్ష చేశారని పేర్కొన్నారు. జీవో 317పై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందన్నారు. జీవో 317 తీసుకురావడం ప్రభుత్వ తొందరపాటు చర్యేనన్నారు. సీఎం కేసీఆర్ మాస్కు పెట్టుకోవడం తాను ఎప్పుడూ చూడలేదని.. మంత్రుల నల్గొండ పర్యటనలో ఎవరూ మాస్కు పెట్టుకోలేదని తెలిపారు. కొవిడ్ నిబంధనలను తెరాస నేతలే పాటించడం లేదని మండిపడ్డారు. ఇవాళ జరిగిన కరీంనగర్ జిల్లా పార్టీ భేటీలోనూ మాస్కులు పెట్టుకోలేదన్నారు. తెరాస నేతల కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలు పోలీసులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెరాస నేతల కొవిడ్ ఉల్లంఘనలపై కేసులు పెడితే రాష్ట్రంలోని జైళ్లు సరిపోవని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.