Huzurabad Byelection: ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు నాదే: ఈటల

హుజూరాబాద్‌లో అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్‌కు బానిసే అని భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార తెరాస..

Updated : 24 Sep 2022 17:14 IST

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌లో అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్‌కు బానిసే అని భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార తెరాస రూ.కోట్లు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కుల సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈటల మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. బానిస అభ్యర్థులు కావాలా? ప్రజల హక్కులు, ఆత్మ గౌరవం కోసం పోరాడే వ్యక్తి కావాలా? అనేది హుజూరాబాద్‌ ప్రజలే నిర్ణయిస్తారన్నారు. హుజూరాబాద్‌ ఎన్నిక ఉపఎన్నిక మాత్రమే కాదని.. ఈ ఎన్నికతో ఇంకెంతమంది రాజేందర్‌లు ప్రశ్నిస్తారోనని సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలందరి మీద కేసీఆర్‌ నిఘా ఉందన్నారు. 2014కు ముందు వరకు సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు ఆస్తులెంతో ప్రజలందరికీ తెలుసునని ఈటల వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని