Ap news: చంద్రబాబు.. మీ కోపాన్ని సీఎంకే పరిమితం చేయండి: పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్‌లో హెరాయిన్ విచ్చలవిడిగా సరఫరా అవుతోందని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయొద్దని మంత్రి పేర్ని నాని కోరారు. ఇలాంటి ఆరోపణలు చేసి

Published : 22 Sep 2021 02:16 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో హెరాయిన్ విచ్చలవిడిగా సరఫరా అవుతోందని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయొద్దని మంత్రి పేర్ని నాని కోరారు. ఇలాంటి ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్‌పై కోపం ఉంటే ఆయనకే పరిమితం చేయాలని.. రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై కడుపుమంట చూపించవద్దన్నారు. చెన్నైలో ఉండే వ్యక్తి విజయవాడలో హెరాయిన్ సరఫరా చేసేందుకు వస్తూ పట్టబడ్డారని కేంద్ర నిఘా సంస్థలు చెప్పాయన్నారు. గుజరాత్‌ నుంచి విజయవాడకు హెరాయిన్‌ సరఫరా అవుతుందనే వార్తలు అవాస్తవమని స్వయంగా విజయవాడ పోలీస్‌ కమిషనర్ బి.శ్రీనివాస్‌ ప్రకటించారని గుర్తు చేశారు. కన్నతల్లితో సమానమైన రాష్ట్ర గౌరవ ప్రతిష్టలను తెదేపా రాక్షస మూటలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. తెదేపా నేతలు ఆంధ్రా తాలిబన్లుగా మారారని విమర్శించారు. గత ఎన్నికల్లో  ప్రజలు తగిన బుద్ధి చెప్పినా కొంత మంది నేతల్లో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని